NewsInn

News in a Click

వేస‌విలో మంచినీటి ఎద్ద‌డి రాకుండా చూడాలి

  • స‌మీక్ష‌లో మంత్రి సీత‌క్క‌

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

రాబోయే వేస‌వి కాలంలో రాష్ట్రంలోని గ్రామా్ల‌లో తాగునీటి స‌మ‌స్య రాకుండా చూడాల‌ని మంత్రి సీత‌క్క అధికారుల‌ను ఆదేశించారు. అధికారులు అన్ని ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో స‌ర్పంచ్ ల‌తో కలిసి మంచినీటి ఎద్ద‌డిపై ఎప్ప‌టిప్పుడు ఆరా తీయాల‌ని స‌మ‌స్య త‌లెత్త‌కముందు నివార‌ణ‌పై దృష్టి పెట్టాల‌ని సూచించారు.గ్రామాల్లో మంచినీటి ఎద్ద‌డిపై ప్ర‌త్యేకంగా డ్రైవ్ లు నిర్వ‌హింన్నారు.గ్రామాల్లో తాగునీటి ఎద్ద‌డి ఉంద‌ని స‌ర్పంచ్ లు అధికారుల దృష్టికి తెస్తే అధికారులు ఆ స‌మ‌స్య ప‌రిష్కారంపై దృష్టి పెట్టి వెంట‌నే ప‌రిష్కారం అయ్యేలా చూడాల‌ని చెప్పారు. రాష్ట్రంలోని 24 వేల ఆవాసాల్లో 150 ఆవాసాలు మాత్ర‌మే తాగునీరు అంద‌డం లేద‌ని అధికారులు మంత్రికి వివ‌రించారు.మేడారం మ‌హా జాతరలో ఎక్కడ తాగునీటి సమస్యలు లేకుండా ప‌నిచేసిన అధికారుల‌ను సీత‌క్క అభినందించి స‌త్క‌రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *