NewsInn

News in a Click

‘కేరళ’ ఇక‌పై ‘కేరళం’…కేంద్రం ఆమోదం..!

(న్యూఢిల్లీ, న్యూస్ఇన్‌)

కేర‌ళ రాష్ట్రంపేరు ఇక‌పై కేర‌ళంగా మార‌నుంది.కేంద్ర మంత్రి వ‌ర్గం ఇందుకు ఆమోదం తెలిపింది. ఇక పై కేర‌ళంగా రాష్ట్ర పేరు మార‌నుంది.ఎన్నోఏళ్లుగా ఉన్న ఈ డిమాండ్ ను కేంద్ర మంత్రి వ‌ర్గం ఈ రోజు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. కేరళ శాసనసభ 24.06.2024న “కేరళ” రాష్ట్రం పేరును “కేరళం”గా మార్చాల‌ని తీర్మానాన్ని ఆమోదించింది…

శాస‌న‌స‌భ‌లో ఆమోదించిన తీర్మానం…
“మన రాష్ట్రం పేరు మలయాళ భాషలో ‘కేరళం’. భాష ఆధారంగా రాష్ట్రాలు 1956 నవంబర్ 1వ తేదీన ఏర్పడ్డాయి. కేరళ పిరవి దినోత్సవం కూడా నవంబర్ 1వ తేదీన జరుగుతుంది. జాతీయ స్వాతంత్ర‌ పోరాటం సమయం నుండి, మలయాళ భాష మాట్లాడే ప్రజల కోసం ఐక్య కేరళ ఏర్పాటు కోసం బలమైన డిమాండ్ ఉంది. కానీ రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో మన రాష్ట్రం పేరు ‘కేరళ’గా నమోదు చేయబడింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం ‘కేరళం’గా పేరును సవరించడానికి అత్యవసర చర్యలు తీసుకోవాలని ఈ అసెంబ్లీ ఏకగ్రీవంగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది.”

రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రస్తుత రాష్ట్రాల పేర్లను మార్చడానికి వీలు కల్పిస్తుంది. ఆర్టికల్ 3 ప్రకారం, పార్లమెంటు చట్టం ద్వారా ఏ రాష్ట్రం పేరునైనా మార్చవచ్చు.‘కేరళ’ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చే విషయాన్నికేంద్ర‌ హోం మంత్రిత్వ శాఖ పరిశీలించింది. కేంద్ర హోం మంత్రి అమీత్ షా ఆమోదంతో, ‘కేరళ’ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చడానికి క్యాబినెట్ కోసం ముసాయిదా ను ప్ర‌భుత్వం ఆమోదించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *