
తుషార్ గాంధీ
(హైదరాబాద్,న్యూస్ఇన్)
గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో మూసీ సుందరీకరణపై రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుండడం వివాదాస్పద అవుతోంది. బాధితులు తమ ఇళ్లను కూల్చి ప్రాజెక్టు నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాదాపు ఆరు నెలల క్రితమే వివాదం మొదలైనా…..త్వరలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు కు శంకుస్థాపన చేస్తామని ప్రభుత్వం వెల్లడించడం, భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేయడంతో తీవ్ర వివాదంగా మారింది. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు తీవ్రం అవుతున్నాయి. తమ ఇళ్లను కూల్చి ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టడాన్ని బాధితులు వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గాంధీ మనువడు తుషార్ గాంధీ గాంధీ సరోవర్ ప్రాజెక్టుపై స్పందించడం చర్చనీయంశంగా మారింది. గాంధీ విగ్రహం ఏర్పాటు కోసం ఇళ్లను కూల్చ వద్దని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఙప్తిచేశారు.ఇళ్లను కూల్చి గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు భూసేకరణచేయడం గాంధేయ విధానం కాదని స్పష్టం చేశారుప.ఎక్స్ లో తన అభిప్రాయాన్న వెల్లడించడంతో ఇది వైరల్ గా మారింది.గాంధీ బ్రతికి ఉన్నాఈ ప్రాజెక్టును వ్యతిరేకించే వారని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం బాపు ఘాట్ సమీపంలో భారీ గాంధీ విగ్రహాన్ని సర్కార్ ఏర్పాటు చేయనుందది. 3,279 ఎకరాల భూసేకరణతో పాటు 10,017 నిర్మాణాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ప్రణాళికలను సిద్ధం చేసింది.ఈ విషయమే తీవ్ర దూమారానికి దారి తీస్తోంది.




Leave a Reply