NewsInn

News in a Click

కానిస్టేబుల్ సౌమ్య సోదరుడికి సర్కారీ కొలువు

నియామక పత్రం అందజేసిన నిజామాబాద్ కలెక్టర్

(హైదరాబాద్ , న్యూస్ఇన్‌)

విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి, గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో అమరురాలైన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది.
ఆమె సోదరుడు జి. శ్రవణ్‌కు ఎక్సైజ్ శాఖలోనే జూనియర్ అసిస్టెంట్‌గా ప్రభుత్వం కేవలం ఆర్థిక సాయమే కాకుండా, ఆ కుటుంబానికి శాశ్వత భరోసా కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అందులో భాగంగానే నేడు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ద్వారా శ్రవణ్‌కు ఉద్యోగ నియామక పత్రం అందజేశారు. సౌమ్య పదవీ విరమణ పొందే వయస్సు వరకు రావాల్సిన పూర్తి జీతభత్యాలను కూడా ఆ కుటుంబానికి చెల్లించాలని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.నిజామాబాద్‌లో గంజాయి స్మగ్లర్ల వాహనాన్ని అడ్డుకునే క్రమంలో సౌమ్య ను ఢీ కొట్టుకుంది. గంజాయి స్మ‌గ్మ‌ర్ల కారు దూసుకు పోయింది. ఈ ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌డ‌ప‌డ్డ సౌమ్య చికిత్స పొందుతూ మృతి చెందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *