
(హైదరాబాద్,న్యూస్ఇన్)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Adobe సీఈవో, తెలంగాణ రైజింగ్-2047 విజన్ బోర్డ్ సభ్యులు శంతను నారాయణ్ మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.గ్లోబల్ ట్రెండ్స్, అవకాశాలపై ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలపై సీఎంతో శంతను నారాయణ్ చర్చించారు.గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, ఉద్యోగాలపై AI ప్రభావం, స్కిల్లింగ్ & రీస్కిల్లింగ్ కు సంబంధించిన అంశాలపై చర్చకువచ్చినట్లు సమాచారం. తెలంగాణను మాన్యుఫ్యాక్చరింగ్ పవర్ గా తీర్చిదిద్దాలని, ఇందుకు కొన్ని ముఖ్యమైన సంస్థలను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందిచాల్సిన అవసరం ఉందని సమావేశంలో సీఎం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.ఎకానమీపై AI రెవల్యూషన్ ప్రభావం, రాబోయే రోజుల్లో AI ని సమర్ధవంతంగా వినియోగించుకునే అంశాలపై కూడా చర్చ జరిగిందన్న సమచారాన్ని అధికార వర్గాలు వెల్లడిచాయి. తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు మరింత సహకరించాలని సీఎం శంతను నారాయణన్ కోరారు.

Leave a Reply