NewsInn

News in a Click

న‌గ‌రంలో న‌కిలీ టీ పొడీ…ఇది తాగితే అంతే

  • పోలీసుల అదుపులో గ్యాంగ్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

న‌కీలీకి ఏది అన‌ర్హం కాద‌న్న చందంగా అన్నింట్లోనూ న‌కిలీ వ‌స్తువులు పుట్టుకొస్తున్నాయి. ఇత‌ర అవ‌స‌రాల‌కు వాడే ఉత్త్ప‌తుల విష‌యం ఎలా ఉన్నా…నిత్యం వాడే ఆహార స‌రుకుల్లో క‌ల్తీ ఆహార వ‌స్తువులు వాడితో ఆ వ‌స్తువుల వాడిన ప్ర‌భావం ఆరోగ్యంపై కూడా తీవ్రంగా ప‌డే అవ‌కాశాలున్నాయి. ఇళ్ల‌లో చాయ్ లేనిదే ఉద‌యం పూట 99శాతం మంది రోజు ప్రారంభం కాదు. దీన్ని ఆస‌రాగా చేసుకుని భారీ ఎత్తున క‌ల్తీ చాయ్ ప‌త్త త‌యారు చేస్తున్న ముఠా పోలీసుల‌కు చిక్కింది.కోకోపిట్ తో న‌కిలీ టీ పౌడ‌ర్ ను ఈ ముఠా త‌యారు చేస్తోందిన పోలీసులు గుర్తించారు. బెల్లం నీరు, సింథ‌టిక్ రంగులు క‌లిపి మ‌రింత క‌ల్తీచేస్తున్నార‌ని ఈ టీ పొడి క‌ల‌ర్ కోసం రంగుల‌ను కూడా వినియోగిస్తున్న‌ట్లు పోలీసులు గురించారు. త‌క్కువ నాణ్య‌త క‌లిగిన టీ డ‌స్ట్ మిశ్ర‌మంతో క‌ల్తీ చాయ్ ప‌త్తా త‌యారు చేసి రోడ్లపై ఉండే చాయ్ బండ్లు, చిన్న‌చిన్న డీల‌ర్ల‌ను టార్గెట్ చేసి ఈ క‌ల్తీ టీ పొడిని బిష్ణోయ్ గ్యాంగ్ మార్కెటింగ్ చేస్తోంది. నాణ్య‌త లేని టీ పౌడ‌ర్ త‌యారు చేసేందుకు సిద్ధంగా ఉన్న 138 కిలోల కోకో పిట్ మిశ్ర‌మాన్ని పోలీసులు సీజ్ చేశారు. సింథ‌టిక్ క‌ల‌ర్స్, గ్యాస్ సిలిండ‌ర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సింథ‌టిక్ క‌ల‌ర్స్ వినియోగం ఆరోగ్యంపై తీవ్ర ప్ర‌భావం చూపిస్తుంద‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు.న‌కిలీ టీపొడి వాడి ప్రాణాల మీద‌కు తెచ్చుకోరాద‌ని పోలీసులు సూచిస్తున్నారు. క‌ల్తీ ఆహార ఉత్ప‌త్తుల‌పై అనుమానం ఉంటే త‌మ‌కు ఫిర్యాదు చేయాల‌ని పోలీసులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *