NewsInn

News in a Click

తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
(హైదరాబాద్, న్యూస్ఇన్‌)

రాష్ట్రంలో ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో తహసీల్దార్ మరియు ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.మొదటి దశలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న 60 తహసీల్దార్ కార్యాలయాలు, 5 ఆర్డీవో కార్యాలయాలకు ఆధునిక సౌకర్యాలతో శాశ్వత భవనాలు నిర్మిస్తామని వెల్లడించారు.అలాగే రెండ‌వ విడ‌త‌లో శిధిలావ‌స్ధ‌లో ఉన్న 170 ఆర్డీవో, త‌హ‌సీల్దార్ కార్యాల‌యాల‌ను నిర్మిస్తామ‌ని వెల్ల‌డించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని భవనాలు ఒకే నమూనాలో, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా డిజైన్ చేయనున్నట్లు తెలిపారు. త‌క్కువ ఖ‌ర్చుతో ప్ర‌జ‌ల‌కు అత్యుత్త‌మ సేవ‌లు అందేలా ఈ భ‌వ‌నాల నిర్మాణం ఉంటుంద‌న్నారు. సచివాలయంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మండలాలకు అవసరమైన పోస్టులు మంజూరు చేసి పరిపాలనను బలోపేతం చేశామని తెలిపారు. అలాగే ప్ర‌జ‌ల‌కు దూరంగా కల‌క్ట‌రేట్‌ల‌ను నిర్మించి నిర్వ‌హ‌ణ‌ను గాలికివ‌దిలేశార‌ని విమ‌ర్శించారు.స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖలో అత్యాధునిక వసతులతో సమీకృత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను ఆధునికీకరించి, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *