(హైదరాబాద్,న్యూస్ఇన్)
ప్రజా సేవలో ప్రభుత్వ అధికారుల బాధ్యతల గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, సిఫారసు చేసే అంశాలను అమలు చేసే కీలక బాధ్యతలను అధికారులు నిర్వహిస్తారు. కొంత మంది అధికారులు తమ పరిధిలోనే ప్రజలకు సాధ్యమైనంత వరకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు వెంట వెంటనే చర్యలు తీసుకుంటారు. మరికొంత మంది అధికారులు ప్రజలు ఎలాంటి సమస్యలు తెచ్చినా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరిస్తామని హామీలు ఇస్తుంటారు. ఇంకొందరు అధికారులు నిబంధనల పేరుతో తాత్సారం చేస్తుంటారు….పరిష్కారం కోసం ఏ మాత్రం ఆసక్తి చూపించరు. పాలనలో ఒక్కో అధికారి ఒక్కో రకంగా తమ బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటారు.ఇక నిర్ణయాలు తీసుకుని అమలు చేసే జిల్లా కలెక్టర్ లాంటి అధికారులు సాధ్యమైనంత వరకు ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలను పరిష్కరించేందుకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు.

రాజకీయ వత్తిళ్లను తట్టుకుని ప్రజా సమస్యలను తమ సమస్యలుగా భావించే ఎంతోమంది అధికారులు ఎక్కువ రోజులు ఒకే చోట పనిచేయడం దాదాపు ఆసాధ్యమే. అయితే…ప్రజా సమస్యలను పెద్దగా పట్టించుకోని ఇబ్బందులు గురిచేసే అధికారులు కూడా ఎంతో మంది ఉంటారు. ప్రజా సమస్యలను పరిష్కరించే అధికారులు ప్రజలతో మన్ననలు పొంది ప్రజాభిమానాన్ని చూరగొంటారు. ప్రజా సమస్యలను పట్టించుకోని అధికారులు మాత్రం సామాన్యప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. అధికారికంగా కార్యాలయాల్లో వ్యవహరించే తీరుఎలా ఉన్నా ప్రజా సమస్యలపై స్పందించే తీరే అధికారులకు క్షేత్ర స్థాయిలో గుర్తింపు తెస్తుంది. ఈ విధంగా కొంత మంది ఉన్నతాధికారులు తమ నిర్ణయాలతో ప్రజలకు దగ్గర దూరం అవుతూ ఉంటారు. ప్రజల దగ్గరైనా అధికారులు బదిలీపై వెళితే అంతా సానుభూతి చూపిస్తూ ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటే బాగుండన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఒక అధికారి బదిలీ అయితే సంబరాలు చేసుకునే సందర్బాలు కూడా అప్పడప్పుడు మనం చూస్తుంటాం…అలాంటి ఘటనే రాష్ట్రంలో చోటు చేసుకుంది.

మహబూబ్ బాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ బదిలీ కావడంతో స్థానికులు సంబరాలు చేసుకున్నారు. బీసీ, గిరిజన సంఘాల నేతల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం సమీపంలోనే సంబరాలు చేసుకుంటూ స్వీట్లు పంచి బాణాసంచాను కాల్చారు. ఈ విషయం జిల్లా వ్యాప్తంగా క్షణాల్లో పాకింది. దీంతో జిల్లా కలెక్టర్ పై ఏ స్థాయిలో ప్రజాసంఘాల వ్యతిరేకంగా ఉన్నాయో ఈ ఘటన తెలియచేస్తోంది. కొంత మంది అధికారులు విధి నిర్వహణలో నిక్కచ్ఛిగా వ్యవహరించినా అలాంటి అధికారుల బదిలీ జరిగితే….అక్రమార్కలు మాత్రమే సంబరాలు చేసుకుంటారు. ఓ జిల్లా కలెక్టర్ బదిలీ అయితే స్వీట్లు పంపిణీ చేసుకోవడం రాష్ట్రంలో చర్చనీయంశంగా మారింది. రెండేళ్లుగా అక్కడ పనిచేసిన కలెక్టర్ పై ఏ స్థాయిలో ప్రజా సంఘాలు వ్యతిరేకత కనబరుస్తాన్నయో అన్న దానికి ఈ ఘటన అద్దం పడుతోంది. అయితే రాష్ట్రంలో పాలనపై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ ఒకే సారి దాదాపు 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. అందులో భాగంగా అద్వైత్ కుమార్ సింగ్ బదిలీ జరిగింది.


Leave a Reply