NewsInn

News in a Click

వి.హెచ్ లేదా జెట్టికి రాజ్య‌సభ ఇవ్వండి

టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి

(న్యూఢిల్లీ,న్యూస్ఇన్‌)

రాష్ట్రం లో ఖాళీ అయిన రాజ్య‌స‌భ స్థానాల‌కు నోటిఫికేష‌న్ వెలువ‌డ‌డంతో కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఢిల్లీ పెద్ద‌లను ప్ర‌స‌న్నం చేసుకునే ప‌నిలో కొంతమంది ప‌డ్డారు. త‌మ‌కు రాజ్య‌స‌భ‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని కొంత మంది కాంగ్రెస్ నేత‌లు హై క‌మాండ్ ను కోరుతుండ‌గా టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి మాత్రం మ‌రో ఇద్ద‌రు నేత‌ల పేర్ల‌ను సూచిస్తూ వారిలో అభ్య‌ర్థిని ఖ‌రారు చేయాల‌ని కాంగ్రెస్ హై క‌మాండ్ ను కోరారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఏఐసీసీ ప్రెసిడెంట్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే స‌హా , రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్ ను క‌లిశారు. ఈ సారి రాజ్య‌స‌భ స్థానాల‌ను కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి.హ‌న్మంత్ రావ్ , జెట్టి కుసుమ కుమార్ ల‌కు రాజ్య‌స‌భ అవ‌కాశం ఇవ్వాల‌ని కోరారు.
జెట్టి కుసుమ కుమార్ యూత్ కాంగ్రెస్ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా ఉన్నార‌ని, కమ్మ సామాజిక వ‌ర్గం కావ‌డంతో ఆయ‌న‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని కోరిన‌ట్లు తెలిపారు. దీనికి తోడు కుసుమ కుమార్ స్వాతంత్ర స‌మ‌ర‌యోధుల కుటుంబం నుంచి నేత‌గా ఉన్నార‌ని, ఆకుటుంబం మొత్తం కాంగ్రెస్ పార్టీ కోసం ప‌నిచేస్తున్న‌ట్లు జ‌గ్గారెడ్డి చెప్పారు.తెలంగాణా రాజ‌కీయాల్లో సీనియ‌ర్ నేత‌గా ఉన్న వి.హెచ్ ఇప్ప‌టికే 3 సార్లు రాజ్య‌స‌భ స‌భ్యుడిగా అవ‌కాశం ఇచ్చినా మ‌రోసారి ఇవ్వ‌డంలో తప్పులేద‌న్నారు. సీనియ‌ర్ నేత‌గా పార్టీ బాగు ప‌డాల‌ని నిత్యం త‌పించే వ్య‌క్తిగా హ‌న్మంత్ రావ్ ఉంటార‌ని జ‌గ్గారెడ్డి అన్నారు. అభ్య‌ర్థుల ఎంపిక‌పై క‌మిటీలు వీరి గురించి చ‌ర్చిస్తామ‌ని ఖ‌ర్గే హామీ ఇచ్చార‌ని జ‌గ్గారెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *