
(న్యూఢిల్లీ, న్యూస్ఇన్)
తమిళ నాడులో ఎన్నికల రాజకీయాలు మొదలయ్యాయి.మాజీముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం డీఎంకే లో చేరారు.ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలుసుకోవడం, పార్టీలో చేరిపోవడం వెంట వెంటనే జరిగిపోయాయి. ఏఐఏడిఎంకేలో కీలక నేతగా పన్నీర్ సెల్వం కొనసాగుతూ వచ్చారు. జయలలిత మరణానంతరం ఇ. పన్నీర్ సెల్వం పార్టీలో చక్రం తిప్పుతుండడంతో పాటు ఓపిఎస్ కు పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదు. దీంతో ఆ పార్టీని వదిలీ స్టాలిన్ సమక్షంలో డీఎంకే లో చేరారు. ఇక మరో వైపు శశికళ కూడా రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొత్త గా రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఇక విజయ్ దళపతి దాదాపు ఆరు నెలల క్రితమే రాజకీయంగా పావులు కదపడం మొదలు పెట్టారు. గతంలో రెండు ప్రధాన పార్టీల మధ్య ఎన్నికలు తమిళనాట జరిగేవి త్వరలో జరుగబోయే ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ప్రాంతీయ పార్టీలపైనే ఆధారపడాల్సి వస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఏ ఐఏడిఎంకే తో కలిసి ఇప్పటికేనడుస్తోంది. రాబోయే ఎన్నికల్లో కూడా ఈ పార్టీల పొత్తు కొనసాగే అవకాశం ఉంటుంది. ఇక బీజేపీ విషయానిక వస్తే డిఎంకేతో రాజకీయంగా కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తుందా లేదంటే… సినీ నటుడు విజయ్ దళపతి పార్టీతో రాజకీయ అడుగులు వేస్తుందా అన్నది ఆసక్తి రేపుతున్న అంశంగా మారింది. త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


Leave a Reply