(న్యూఢిల్లీ,న్యూస్ఇన్)
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఐదుగురు నేతలను జైలులో పెట్టారు. సీఎం, డిప్యూటీ సీఎంలతో సహా ఐదుగురిని జైలులో పెట్టారు. కేజ్రీవాల్ ఏనాడూ అవినీతికి పాల్పడలేదు. మేము అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్లం. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే మీడియాతో మాట్లాడిన ఆయన, “నేను అవినీతిపరుడను కాను” అని స్పష్టం చేస్తూ, తాను మరియు మనీష్ సిసోడియా నిజాయితీ గలవారేనని కోర్టు పేర్కొన్నట్టు తెలిపారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైందని ఆరోపించిన కేజ్రీవాల్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ కుట్ర లని కేజ్రీవాల్ మరోసారి మోడీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.
ఈ కేసులోమనీష్ సిసోడియా 530 రోజులు జైలులో గడిపారు. అరవింద్ కేజ్రీవాల్ రెండు విడతల్లో కలిపి సుమారు 156 రోజులు జైలులో ఉన్నారు. 2024 సెప్టెంబర్ 13న సుప్రీంకోర్టు సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదలయ్యారు.2021లో ఢిల్లీ ప్రభుత్వం ఆదాయం పెంచడం, మద్యం వ్యాపారాన్ని సంస్కరించడం లక్ష్యంగా రూపొందించిన ఎక్సైజ్ పాలసీపై అక్రమాల ఆరోపణలు రావడంతో డల్లీ లెఫ్టినెంట్ కల్నర్ ఫిర్యాదు మేరకు సీబీఐ దర్యాప్తుకు కేంద్రం ఆదేశించింది. ఈ పాలసీ ద్వారా ప్రైవేట్ సంస్థలకు అనుచిత లాభాలు కల్పించబడ్డాయని, ప్రజా ధనానికి నష్టం కలిగిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరియు సీబీఐ ఆరోపించాయి. సిసోడియాను సీబీఐ 2023 ఫిబ్రవరి 26న అరెస్ట్ చేయగా, మార్చి 9న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అరెస్ట్ చేసింది. 2021-22 ఎక్సైజ్ పాలసీ విషయంలో సరైన అనుమతి లేకుండా నిర్ణయాలు తీసుకుని అనుచిత లాభాలు కల్పించారని ఎఫ్ఐఆర్లో సీబీఐ ఆరోపించింది.అరవింద్ కేజ్రీవాల్ను 2024 జూన్ 26న, ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో సీబీఐ అధికారికంగా అరెస్ట్ చేసింది.
కేసు అనంతరం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు…
కేసులో 23 మందికి విముక్తి …..
కుల్దీప్ సింగ్, అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత కల్వకుంట్ల, నరేందర్ సింగ్, విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, అరుణ్ రామచంద్ర పిళ్ళై, మూత గౌతం, సమీర్ మహేంద్రు, అమన్దీప్ సింగ్ దాల్, అర్జున్ పాండే, గోరంట్ల బుచ్చిబాబు, రాజేష్ జోషి, దామోదర్ ప్రసాద్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ కుమార్ సింగ్, చంప్రీత్ సింగ్ రాయట్, దుర్గేష్ పాఠక్, అమిత్ అరోరా, వినోద్ చౌహాన్, ఆశిష్ చాంద్ మథుర్, శరత్ చంద్రా రెడ్డిలకు క్లీన్ ఇచ్చింది.


Leave a Reply