NewsInn

News in a Click

భార‌త్ – వీండీస్ మ్యాచ్ ఇరు జ‌ట్ల‌కు కీల‌క‌మే

భార‌త్ – వీండీస్ మ్యాచ్ ఇరు జ‌ట్ల‌కు కీల‌క‌మే
  • సేమిస్ చేరాలంటే గెలిస్తేనే ముందుకు

(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్‌)

టీ-20 ప్ర‌పంచ క‌ప్ లో భార‌త జ‌ట్టు జింబాబ్వే పై భారీ విజ‌యాన్ని న‌మోదు చేసుకున్నా మ‌రో గండం గ‌ట్టెక్కాల్సి ఉంది. కోల్ క‌త్తా లో జ‌రిగే మ్యాచ్ లో వీండీస్ పై విజ‌యం సాధిస్తేనే సెమిస్ కు అర్హ‌త సాధిస్తుంది. మ్యాచ్ లో భార‌త ఓడినా….వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దైనా భార‌త్ ఇక్క‌డితో ఆగిపోవాల్సిన ప‌రిస్తితులే త‌లెత్తే ప్ర‌మాదం ఉంది. గ్రూప్ ఏ లో ఇప్ప‌టికే ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు అన్ని మ్యాచ్ ల‌లో విజ‌యం సాధిస్తూ సెమీస్ బెర్త్ ఖ‌రారు చేసుకుంది. త‌రువాతి స్థానం కోసం భార‌త్, వీండీస్ జ‌ట్లు పోటీ ప‌డుతున్నాయి. ఈ రెండు జ‌ట్లుకూడా కీల‌క మ్యాచ్ ల‌లో ఓట‌మిచెంద‌డంతో ఆదివారం జ‌రిగే మ్యాచ్ లో విన్న‌ర్లే సేమిస్ స్థానం ఖ‌రారు కానుంది.

అయితే చైన్నై లో జ‌రిగిన మ్యాచ్ లో భార‌త జ‌ట్టు అన్ని విభాగాల్లో రాణించింది. ప్ర‌దానంగా జ‌ట్టును వేధిస్తున్న ఓపెనింగ్ స‌మ‌స్య జింబాబ్వేతో మ్యాచ్ లో క‌నిపించ‌లేదు. ఓపెన‌ర్లు సంజు శాంస‌న్, అభిషేక్ శ‌ర్మ‌లు ఈ టౌర్న‌మెంట్లోనే తొలి సారి అత్య‌ధిక భాగ‌స్వామ్యాన్ని భార‌త జ‌ట్టు త‌ర‌పున న‌మోదు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన అన్ని మ్యాచ్ ల‌లో విఫ‌ల‌మైన అభిషేక్ జింబాబ్వేతో మ్యాచ్ ఆర్ధి సెంచరీ చేసి ఫాంలోకి వ‌చ్చిన సంకేతాలు ఇస్తున్నారు. అదే విధంగా హార్దిక్ పాండ్య‌, తిల‌క్ వ‌ర్మ‌లు లు కూడా జోరు పెంచారు. వ‌ర్మ ఐసీసీ టౌర్న‌మెంట్లో ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద‌గారాణించ‌క‌పోయినా జింబాబ్వే మ్యాచ్ లో మాత్రం త‌క్కువ బంతుల‌నుఎదుర్కొని భారీగా ప‌రుగులు రాబ‌ట్టారు. ఈ జోడీ కూడా భారీ గా ప‌రుగులు చేయ‌డంతో బ్యాటింగ్ లో త‌డ‌బాటుకు ఇండియా గ‌ట్టెక్కింద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇంకా బౌలింగ్ లో మాత్రం పూర్తి స్థాయిలో భార‌త బౌల‌ర్లు ప్ర‌భావితం చేయ‌లేక‌పోతున్నార‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. బూమ్రా విఫ‌ల‌మైతే ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది జ‌ట్టులో ప్ర‌శ్నార్ధకంగానే ఉంది. వ‌ర‌ల్డ్ క్లాస్ స్పిన్న‌ర్లు ఉన్నా… ప‌సికూన‌ల్లాంటి జ‌ట్ల‌తో కూడా ఇటీవ‌ల ఆ ఆట‌గాళ్లు ప్ర‌భావం పెద్ద‌గా చూప‌లేక‌పోతున్నారు.వ‌ర‌ణ్ చ‌క్ర‌వ‌ర్తి, వాషింగ్ట‌న్ సుంద‌ర్ల‌కు ప‌ట్టు చిక్కితే ప్ర‌త్య‌ర్థి బ్యాట‌ర్లు వారిని ఎదుర్కోవ‌డం స‌వాల్ గా మారే అవ‌కాశం ఉంటుంది.

ఇక వీండీస్ జ‌ట్టు విష‌యానికి వ‌స్తే ఆ జ‌ట్టు యువ ఆట‌గాళ్ల వ్య‌వ‌హారం అంతు చిక్క‌ని విధంగా ఉంది. ఒక్కో భారీ ప‌రుగులు సాధిస్తారు..మ‌రోసారి ప‌రుగులు సాధించేందుకే అవ‌స్థ‌లు ప‌డుతారు. జింబాబ్వేతో జ‌రిగిన మ్యాచ్ లో భారీగా స్కోరు చేసిన వీండీస్ దక్షిణాఫ్రికా తో మ్యాచ్ కువ‌చ్చే స‌రికి ఆ స్థాయిలో ప్ర‌భావం చూప‌లేక‌పోయారు. ఆ జ‌ట్టులో ఉన్నంత మంది హిట్ల‌ర్లు ప్ర‌స్తుత ప్ర‌పంచ క్రికెట్ లో ఏ జ‌ట్టులో కూడా లేరు. దీంతో ఆ జ‌ట్టు బ్యాట‌ర్లను అంచ‌నా వేయ‌డం అంత సులువు కాదు. బ్యాటింగ్ లో షాయి హోప్, హేట్మియ‌ర్, కింగ్, షెప‌ర్ట్ వంటి ఆట‌గాళ్లు వంటి చేత్తో మ్యాచ్ ను గెలిపించే స‌త్తా ఉన్న ఆట‌గాళ్లుగానే గుర్తింపు ఉన్నారు. ఆ జ‌ట్టును బౌలర్ల స‌మ‌స్య వెంటాడుతూనే ఉంది.

లీగ్ ద‌శ‌లో, సూప‌ర్ 8 ద‌శ‌లో కూడా వీండీస్ జ‌ట్టు భారీగా స్కోర్లు న‌మోదుచేయ‌డంతో ర‌న్ రేట్ విష‌యంలో భార‌త జ‌ట్టు కంటే ఎంతో మెరుగ్గా ఉంది. భార‌త తో జ‌రిగే మ్యాచ్ ఫ‌లితం రాకుండా ర‌ద్దు అయితే చెరో పాయింట్ ద‌క్కుతుంది.ఈ ప‌రిస్థితి త‌లెత్తితే వీండీస్ కే సెమిస్ వెళ్లేందుకు లైన్ క్లియ‌ర్ అవుతోంది. ఈ మ్యాచ్ లో ఎవ‌రు గెలిచినా వారు నేరుగా సేమిస్ లో ఎంట‌ర్ అవ్వ‌డం ఖాయం. దీంతో మ్యాచ్ లో గెలుపొందేందుకు ఇరు జ‌ట్లు నువ్వా…నేనా అన్న‌ట్లు త‌ల‌ప‌డనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *