
కేటిఆర్ ట్వీట్ పై ఘాటుగా స్పందించిన కవిత
(న్యూస్ఇన్, హైదరాబాద్)
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అహంకారం, ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం వల్లే ఓడి పోయిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. కేటిఆర్ చేసిన ట్వీట్ ను తప్పుబట్టారు. తనపై లిక్కర్ కేసు నమోదు కావడంతోనే ఎన్నికల్లో ఓడి పోయామని బీఆర్ ఎస్ నేతలు చేసిన ప్రచారంపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి తీర్పుతో ఈ ప్రచారాన్ని ఇక్కడికైనా మానుకోవాలని బీఆర్ఎస్ నేతలకు కవిత హితవు చెప్పారు. కేటిఆర్ ఈ రోజు చేసిన ట్వీట్ లో కూడా ఢిల్లీలో కేజ్రీవాల్ ఓటమికి ఈ కేసు కారణమని వ్యాఖ్యానించారని, దాని గురించి నాకు తెలియదు. కానీ నేను జేలుకు వెళితే ఎవరూ పట్టించుకోలేదన్నారు. నా పై కేసు పెట్టిందే పార్టీ కోసం కాదా అని ప్రశ్నించారు. తన కేసుపై ఎవరూ స్పందించలేదన్నారు. కేటిఆర్, కేసిఆర్ సహా కీలక నేతలు పట్టించుకోలేదని తెలియదా అన్నారు. అవినీతి పరులు, అహంకారం కారణంగానే ఓడిపోయిన విషయాన్ని బీఆర్ ఎస్ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఎన్నో కారణాలు ఉన్నాయన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఉద్యోగాలు, ఇంకా ఎన్నో సమస్యలు ఆనాడు ఉన్నాయన్నారు. తాను రెండు నెలల్లో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నానని కోర్టు తీర్పు వల్ల దేవుడి అనుగ్రహం కూడా తన వైపు ఉందని భావిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ లో కేసు తప్పని కొట్టి వేయడం న్యాయ వ్యవస్థపై నమ్మకం పెంచిందని కవిత చెప్పారు. కుట్ర పూరితంగాకేసు నమోదు చేసిన సమయంలోనే కడిగిన ముత్యంలా బయటకు వస్తానని ఆనాడే చెప్పానన్నారు. ఐదున్నర నెలలు అందరికీ దూరంగా జరిగిన నష్టాన్ని ఎవరూ భర్తీ చేయలేరన్నారు. అమ్మా, నాన్న అత్త, మామలకు ధన్యవాదాలు తెలియచేశారు.
లిక్కర్ స్కాం తీర్పు పై కేటిఆర్ ట్వీట్….



Leave a Reply