NewsInn

News in a Click

బాధ్యత గల ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ సూచనలను ప్రధాని మోదీ పరిగణలోకి తీసుకోవడం లేదు

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

(న్యూఢిల్లీ,న్యూస్ ఇన్)

దేశ ప్రజల సంక్షేమం కోసం పార్లమెంట్ సాక్షిగా రాజుల గాంధీ విలువైన సలహాలు ఇస్తున్నారని ఈ సలహాలు ప్రధాని మోడీ వింటున్నా అమలు చేయడం లేదని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.దేశ ప్రజల భవిష్యత్తు కోసం కరోనా, డిల్లీ పొల్యూషన్ విషయం లో రాహుల్ గాంధీ సూచనలను ప్రధాని మోడీ లెక్క చేయలేదన్నారు. డిల్లీ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో జగ్గారెడ్డి మాట్లాడుతూ…గతంలో చోటు చేసుకున్న పలు పరిణామాలు వివరించారు. దేశంలో కరోనా రావడానికి ముందే రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని ఆప్రమత్తం చేసినా కేంద్రం సరైన సమయంలో చర్యలు చేపట్టడంలో విఫలమైందని విమర్శించారు. విదేశాల నుండి ఇండియా వచ్చే వారి పై జాగ్రత్తలు తీసుకోవాలన్న రాహుల్ సూచనలు ప్రధాన మంత్రి మోడీ విన్నా అమలు చేయలేదని చెప్పారు. ఆ తర్వాత కొన్ని రోజుల వ్యవధిలోనే ఏమైందో మనం అంతా చూశామన్నారు. రెండేళ్ల పాటు దేశం మొత్తం కరోనా కారణంగా ఎన్నో ఇబ్బందులు పడ్డామని గుర్తుచేశారు.

డిల్లీ లో పెరుగుతున్న కాలుష్యం పై సైతం ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు గా రాహుల్ గాంధీ పార్లమెంట్ లో మాట్లాడుతూ అవసరమైన సూచనలు చేస్తున్నారని జగ్గారెడ్డి అన్నారు. డిల్లీ లో పెరుగుతున్న కాలుష్య నివారణకు రాహుల్ గాంధీ ఇస్తున్న సూచనలను ప్రధానమంత్రి వింటున్నా అమలు చేయడం లేదన్నారు.ప్రతిపక్ష నాయకుడిగా దేశ ప్రజల సంక్షేమం కోసం రాహుల్ గాంధీ ఎప్పటికప్పుడు తన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. కానీ వాటిని అమలు చేయడం లో ప్రధాన మంత్రి మోడీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత సలహాలు కేంద్రం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని జగ్గారెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *