
(తిరుమల,న్యూస్ఇన్)
సూర్యగ్రహణ, చంద్రగ్రహణం సందర్బంగా దాదాపు అన్నీ ఆలయాలు మూసి వేస్తారు. గ్రహాణానంతరం సంప్రోక్షణ అనంతరం దేవాలయాలను తిరిగి తెరుస్తారు. ఆ తరువాతే భక్తులకు దర్శనాలకు అనుమతి ఇస్తారు. ఇదంతా 99 శాతం దేవాలయాల్లో జరిగే ప్రక్రియ అయితే….. తెలుగు రాష్ట్రాల్లో ఒక దేవాలయం మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. గ్రహణం సందర్భంగా ఆ దేవాలయాన్ని ఎప్పుడూ మూసి వేసే సంప్రదాయాన్ని ఆ దేవాలయం పాటించదు. దేవాలయంలో నిత్యం మాదిరిగానే గ్రహణ సమయంలో కూడా పెద్ద ఎత్తున భక్తులు దర్శనం చేసుకుంటారు. గ్రహణ సమయంలో తెరిచి ఉండే ఏకైక ఆలయం తెలుగు రాష్ట్రంలో శ్రీకాళహస్తి మాత్రమే. గ్రహణ సందర్భంగా భక్తులు ఇక్కడ శీకాళహస్తీశ్వరుడిని దర్శించుకునేందుకు అత్యంత ప్రాధన్యత ఇస్తారు.

తెరిచి ఉంచేందుకు కారణం తెలుసా…..
ఏ గ్రహణమైనా సూర్యుడు, చంద్రుడిని కబళించేది రాహు, కేతువులే. శివుడు వీరికి గ్రహాధిపత్యం ఇచ్చాడని నమ్మకం. శ్రీకాళహస్తీశ్వరుడికి నవగ్రహ కవచం ఉంటుంది. ఈ ఆలయంలో నిత్యం రాహు-కేతు పూజలు నిర్వహిస్తారు. గ్రహణ సమయంలో దర్శించుకుంటే రాహు-కేతు దోషాలు, నక్షత్ర దోషాలు, నవగ్రహ దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. గ్రహణ సమయంలో స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక గ్రహణకాల శాంతి అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ రోజుచంద్రగ్రహణం మధ్యాహ్నం సుమారు 3:20 గంటల నుంచి సాయంత్రం 6:47 గంటల వరకు కొనసాగనుంది.ఈ సమయంలో దేవాలయంలో ప్రత్యేక పూజలు దేవాలయంలో నిర్వహిస్తారు. ఎంతో మంది భక్తులు ఈ సమయంలో స్వామి వారిని దర్వించుకుంటే రాహు, కేతు దోషాల ప్రభావం గణనీయంగా తగ్గుతందన్నది నమ్మకం. ఈ కారణంగానే శ్రీ కాళ హస్తీ దేవాలయాన్ని గ్రహణ సమయాల్లో కూడా తెరిచే ఉంచుతారు.




Leave a Reply