
(హైదరాబాద్,న్యూస్ఇన్)
మూసీ నదీ ని అక్రమించి అక్రమంగా నిర్మాణం చేస్తున్న భవనాలను కూల్చి వేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ధర్నా నిర్వహించిన కవితను పోలీసులు అరెస్టు చేశారు. మూసీ సుందరీకరణలోభాగంగా ప్రభుత్వం వేలాది మంది పేదల ఇళ్లను కూల్చి వేస్తోందని, మూసీ నడి బొడ్డున నిర్మాణంలో ఉన్న భారీ అక్రమ నిర్మాణాలను మాత్రం ప్రోత్సహించే విధంగా వ్యవహరిస్తోందని కవిత నిరసన చేపట్టారు. స్థానికులతో కలిసి నిరసన తెలిపారు. ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చి వేయాలని డిమాండ్ చేశారు. హైడ్రా కు ఈ భవన నిర్మాణం కనిపించడం లేదని హైడ్రా అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా స్పందించి భవన నిర్మాణాన్ని కూల్చి వేసేందుకు చర్యలు చేపట్టేంత వరకు నిరసన కొనసాగిస్తానని ప్రకటించారు. దీంతో సాయంత్రం 7 గంటల సమయంలో కవితను పోలీసులు అరెస్టు చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అక్రమ నిర్మాణాలపై న్యాయ పోరాటం:కవిత
పోలీసులు బలప్రయోగంతో మిమ్మల్ని అరెస్ట్ చేయడం అన్యాయం
మూసీ నది మధ్యలో పెద్దవాళ్లు కడుతున్న బిల్డింగులను వదిలిపెట్టి పేదవాళ్ల బిల్డింగులు కూలగొడుతున్నారు
బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ నిర్మాణాలకు అనుమతి ఇచ్చింది.. దానినే కాంగ్రెస్ కొనసాగిస్తోంది.. పెద్దల పక్షాన్నే ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పడానికి ఇదే నిదర్శనం
మూసీ రివర్ బెడ్ లో ఉన్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదు.. అదే వెలుగుమట్లలో పేదలు వేసుకున్న గుడిసెలను బలవంతంగా కూల్చేశారు
హైదరాబాద్ శివారుల్లో పేదల ఇండ్లను కూల్చేసినందుకు ఈ ప్రభుత్వం తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది
రేపు అయినా హైడ్రా బుల్డోజర్లు ఇక్కడికి వస్తేనే.. రంగనాథ్ గారు స్పందించి చర్యలు తీసుకుంటేనే ఈ ప్రభుత్వం పేదల పక్షాన ఉన్నదని మేం భావిస్తాం.. ఇతర నిర్మాణాలకు మూసీ ఒడ్డు నుంచి 30 మీటర్ల దూరం ఉండాలనే నిబంధనలు విధిస్తున్న ప్రభుత్వం కొందరు పెద్దల భవనాలు 5 మీటర్ల దూరంలోనే ఉన్న అనుమతులు ఇస్తున్నారంటే ఎంతటి అక్రమాలు జరుగుతున్నాయో తేలిపోతున్నది.. ఈ అక్రమ నిర్మాణాలపై జాగృతి న్యాయపోరాటం చేస్తుంది
కవితతో పాటు ధర్నా నిర్వహిస్తున్న పలువురు జాగృతి నేతలను కూడా పోలీసులు అరెస్టు చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.




Leave a Reply