
(హైదరాబాద్,న్యూస్ఇన్)
వికారాబాద్ లో జరిగిన తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా శిబిరాల ముగింపు సందర్బంగా ఆసక్తి కర పరిణామం చోటు చేసుకుంది. దాదాపు పది రోజుల పాటు జరిగిన ఈ శిబిరాల ముగింపుకు ఏఐసీసీ అగ్రనేత రాహూల్ గాంధీ హాజరై కాంగ్రెస్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక కాంగ్రెస్ నేతలంతా ఈ సమాశానికి హాజరు కావడంతో పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సమావేశాలను నిర్వహించింది. తొలి రోజు సీఎం రేవంత్ రెడ్డి హాజరై ప్రారంభించగా ముగింపుకు కాంగ్రెస్ అగ్రనేత రాహూల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన పీఏసీ సమావేశంలో కూడా రాహూల్ పాల్గొన్నారు. సమావేశం ముగిసిన తరువాత కారు ఎక్కేందుకు వెళుతున్న రాహూల్ అక్కడే ఉన్నా ఏపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ లు మస్తాన్, జగ్గారెడ్డిలను గమనించలేదు. రాహూల్ వెళుతున్న విషయాన్ని చూసిన మస్తాన్ రాహూల్ జీ జగ్గన్న హియర్ అనడంతో….. రాహుల్ గాంధీ జగ్గారెడ్డి వైపు చూసి చేతిని గట్టిగా పట్టుకుని హాయ్ జగ్గా జీ.. హౌ ఆర్ యు అంటూ ఆప్యాయంగా పలకరించారు.

అనంతరం కార్ ఎక్కి వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీ శిబిరాలు జరుగుతున్న సమయంలోనే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఢిల్లీ లో పర్యటించి కాంగ్రెస్ పెద్దలను కలుసుకున్నారు. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే తో పాటు కీలక నేతలను కలుసుకుని రాష్ట్రంలో ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాల్లో విహెచ్, జెట్టి కుసుమ కుమార్ లలో ఒకరికి అవకాశం ఇవ్వాలని కోరారు. రాహూల్ గాంధీ ప్రధాని కావాల్సిన అవసరం ఉందని జగ్గారెడ్డి ఢిల్లీలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యటనలో భాగంగా పార్టీ అగ్ర నేత స్వయంగా జగ్గారెడ్డిని పేరుతో పిలిచి ఆప్యాయంగా పలుకరించడంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.



Leave a Reply