NewsInn

News in a Click

యుద్ధం ఎఫెక్ట్… పెట్రోల్, డీజిల్ నో టెన్ష‌న్

  • కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ప్ర‌క‌ట‌న‌

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారతదేశం అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు. ఈ యుధ ప్ర‌భావంతో ప్ర‌ధానంగా పెట్రో ఉత్ప‌త్తుల‌పై ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. భారతదేశం రిఫైనరీ విషయంలో నాలుగో స్థానం, ఎగుమతుల విషయంలో ఐదో స్థానంలో ఉంది. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతిలో మూడో స్థానంలో ఉన్నప్పటికీ.. పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలతో భారతదేశానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బందేమీ లేదన్నారు. . దేశంలో పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ATF) వంటి పెట్రోలియం ఉత్పత్తులు, క్రూడ్ ఆయిల్ నిల్వలు సరిపడా ఉన్నాయని తెలిపారు.

నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిననాటి నుంచీ దేశంలో ఇంధన భద్రతకు ప్రాధాన్యత ఇస్తోంది. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ (మంగళూరు, పాదూర్, విశాఖపట్టణం లోని వ్యూహాత్మక ఇంధన నిల్వలు) పెంచుకోవడంతోపాటుగా.. దేశీయంగా చమురు ఉత్పత్తి, ఇథనాల్ బ్లెండింగ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించింది. దీని కారణంగా.. గత కొన్నేళ్లుగా దేశంలో ప్రజలకు పెట్రోల్ ఉత్పత్తులు అందుబాటులో ఉంచడంతోపాటుగా.. అంతర్జాతీయంగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నా.. దేశీయంగా ధరలు పెరగకుండా ఉండేలా చర్యలు తీసుకుందని చెప్పారు. అవసరమైన మేర దిగుమతి చేసుకోవడానికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా.. భారతదేశంలో పెట్రోలు కొరత పరిస్థితులు తలెత్తే ప్రసక్తే లేదని స్ప‌ష్టం చేశారు.

తాజా పరిస్థితుల నేపథ్యంలో.. భారతదేశ ఎగుమతులు, దిగుమతులను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, షిప్పింగ్-పోర్ట్స్ మంత్రిత్వ శాఖ, పెట్రోలియం మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం (CBDT), డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తో కలిసిన ఒక వివిధ మంత్రిత్వ శాఖల బృందాన్ని ఏర్పాటుచేసిందన్నారు.

రాష్ట్రంలో ఖ‌జానా నిల్….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *