NewsInn

News in a Click

తొలి సెమీస్ లో న్యూజీలాండ్ ఘ‌న విజ‌యం

తొలి సెమీస్ లో న్యూజీలాండ్ ఘ‌న విజ‌యం
  • ఫిన్ అలెన్ సెంచ‌రీ

(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్‌)

ఐసీసీ టీ-20 ప్ర‌పంచ‌క‌ప్ లో తొలి సెమీఫైన‌ల్స్ లో న్యూజీలాండ్ ద‌క్షిణాఫ్రికా పై ఘ‌న విజ‌యం సాధించింది. ప్రోటీస్ ముందుగా బ్యాటింగ్ చేసి 170 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యాన్ని కీవీస్ ముందు ఉంచింది. కీవీస్ ఓపెన‌ర్లు ఫిన్ అలెన్, టీం సెల్ప్రిట్ లు ద‌క్షిణా బౌల‌ర్ల భ‌ర‌తం ప‌ట్టారు. 170 ప‌రుగ‌ల ల‌క్ష్యంతో బ‌రిలో దిగిన ఈ ఇద్ద‌రు మ్యాచ్ ఫినిష్ చేసేలా దూకుడుగా ఆడారు. వంద ప‌రుగుల భాగ‌స్వామ్యం అనంత‌రం మ్యాచ్ ను తొంద‌ర‌గా ముగించాల‌న్న ల‌క్ష్యంగా బ్యాటిగ్ చేసి టీం సెల్ఫ‌ర్ట్ వెనుదిరిగారు. వీరి భాగ‌స్వామ్యం 9.1 ఓవ‌ర్ల‌లోనే 117 ప‌రుగుల వ‌ర‌కు స్కోరును తీసుకెళ్లింది.

అక్క‌డ సెల్ప‌ర్ట్ 33 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్ ల స‌హాయంతో 58 ప‌రుగులు చేసి ర‌బాడా బౌలింగ్ లో ఔట‌య్యారు. మ‌రో వైపు క్రీస్ లో నిల‌దొక్కుకున్న ఫిన్ అలెన్ అదే దూకుడును కొన‌సాగించారు. ప‌ది ఓవ‌ర్ల‌లోనే ల‌క్ష్యానికి కీవీస్ చేరువ కావ‌డంతో ఎక్క‌డా మ్యాచ్ లో ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో క‌నిపించ‌కుండానే కీవీస్ జ‌ట్టు మ్యాచ్ ను ముగించింది. ఫిన్ అలెన్ 33 బంతుల్లోనే 100 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచారు అలెన్ 10 ఫోర్లు, 8 సిక్స్ లు కొట్టి త‌న సెంచ‌రీ పూర్తి చేసుకోవ‌డంతో న్యూజీలాండ్ ను ఫైన‌ల్ కు చేర్చారు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్లు ఏ ద‌శ‌లోనూ న్యూజీలాండ్ బ్యాట్స్ మెన్ల‌ను క‌ట్ట‌డి చేయ‌డంలో విజ‌య వంతం కాలేక‌పోయారు. కేవ‌లం 13 ఓవ‌ర్ల‌లోనే న్యూజీలాండ్ ఒక వికెట్ కోల్పోయి 173 ప‌రుగులు సాధించి ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంది.

అంత‌కు ముందు బ్యాటింగ్ చేసిన ద‌క్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్లు న్యూజీలాండ్ బౌల‌ర్ల‌ను ఎదురొనేందుకు తీవ్ర ఇబ్బందులు ప‌డాల్సి వ‌చ్చింది. టౌర్ని్లో ఫుల్ ఫాంలో ఉన్న ప్రోటీస్ బ్యాట్స్ మెన్లు ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ లో పెద్ద‌గా రాణించ‌క‌పోయ‌వ‌డంతో ఒక్క ఓట‌మితో ఆ జ‌ట్టు టౌర్న‌మెంట్ నుంచి బ‌య‌ట‌కు రావాల్సి వ‌చ్చింది. 20 ఓవ‌ర్ల‌లో ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు 8 వికెట్లు కోల్పోయి 169 ప‌రుగుల చేసింది. ప్రోటీస్ ఇన్నింగ్స్ త‌డబ‌డుతూనే మొద‌లైంది. 2వ ఓవ‌ర్లోనే జ‌ట్టు స్కోరు 12 ప‌రుగుల వ‌ద్ద ఓపెన‌ర్ క్వింట‌న్ డీకాక్ ఔట‌య్యారు. అదే స్కోరు వ‌ద్ద బ్యాటింగ్ వ‌చ్చిన రికెల్ట‌న్ కూడా వెనుదిరిగారు. 3వ వికెట్ భాగ‌స్వామ్యం కోసం కెప్ట‌న‌ర్ మార్క‌ర్రం, బ్రేవీస్ తో క‌లిసి మంచి భాగ‌స్వామ్యం అందిస్తార‌న్న స‌మ‌యంలోనే 55 ప‌రుగుల వ‌ద్ద మార్క్ రం 8 వ ఓవ‌ర్లో 18 ప‌రుగులు చేసి వెనుదిరిగారు. ఆ త‌రువాత స్కోరు 77 ప‌రుగుల‌కు చేరుకున్న స‌మ‌యంలో కీవీస్ బౌల‌ర్ ర‌చిన్ ర‌వీంద్ర మ‌రో కీల‌క బ్యాట్స్ మెన్ డేవిడ్ మిల్ల‌ర్ ను ఔట్ చేశారు.

అదే స్కోరు వ‌ద్ద రికెల్ట‌న్ కూడా ఔట్ కావ‌డంతో కీవీస్ 10 ఓవ‌ర్ల‌కు ముందే స‌గం మంది కీల‌క బ్యాట‌ర్లు పెవిలియ‌న్ చేరుకున్నారు. ఆ త‌రువాత ఆల్ రౌండ‌ర్ జ‌న్సెన్ ద‌క్షిణాఫ్రికా జ‌ట్టును గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోరు సాధించే విధంగా జోరు పెంచ‌డంతో 30 బంతుల్లో 55 ప‌రుగులు చేశారు. జెన్స‌న్, స్ట‌బ్స్ లు చివ‌ర్లో రాణించ‌డంతో 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి ద‌క్షిణాఫ్రికా 169 ప‌రుగులు చేసింది.

ఫైన‌ల్స్ కు చేరుకున్న న్యూజీలాండ్….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *