
-కేంద్ర మంత్రిగా నితీష్ కుమార్
(న్యూఢిల్లీ,న్యూస్ఇన్)
బీహార్ లో 10వ సారి ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహస్తున్న నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం బీజేపీతో కలిసి జేడీయూ సర్కార్ ను ఏర్పాటు చేయడంతో నితీష్ కుమార్ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బీజేపీ ఒంటరిగా ఇక్కడ అధికారంలోకి రాకపోవడంతో జేడీయూతో కలిసి మిత్రపక్షంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీహార్ రాజకీయాల్లో బీజేపీ, జెడీయుతో కలిసి సాగుతుండగా కాంగ్రెస్ ఆర్జేడీ తో కలిసి రాజకీయ ప్రయాణం సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ కు కేంద్ర బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ ఖాతాలో బీహార్ రాష్ట్రాన్ని వేసుకునేందుకు ప్రస్తుతం మిత్రపక్ష సీఎం గా ఉన్న నితీష్ ను ఆ స్థానం నుంచి తప్పించి కేంద్ర మంత్రి వర్గంలో ఆయన కోరుకున్న శాఖను ఇచ్చేందుకు రెడీ అన్న సంకేతాలు బీజేపీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

దీనికి నితీష్ కూడా ఓకే చెప్పడంతో ఇక నితీష్ కుమార్ కేంద్ర మంత్రి కావడం లాంఛనంగా చెప్పుకోవచ్చు. సీఎం పదవికి రాజీనామా చేసి రాజ్యసభ అభ్యర్థిగా నితీష్ నామినేషన్ వేయనున్నారు. బీహార్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన అనంతరం త్వరలో కేంద్ర మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణలో కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా నితీష్ బాధ్యతలు దక్కించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైల్వే మంత్రిగా ప్రస్తుతం అశ్విని వైష్ణవ్ కొనసాగుతూ ఇతర శాఖలను కూడా నిర్వహిస్తున్నారు. రైల్వే మంత్రిగా పూర్తి స్థాయి హోదాను నితీష్ కు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం అయినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

బీజేపీ సీఎం అభ్యర్థి….?
నితీష్ కుమార్ రాజీనామాతో కొత్త సీఎంగాబీహార్ లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న దానిపై ఎన్నో ఊహాగానాలు మొదలయ్యాయి.. ప్రస్తుతం జాతీయ పార్టీ అధ్యక్షులుగా ఉన్న నితిన్ నబిన్ అదే రాష్ట్రానికి చెందిన నేత కావడంతో బీహార్ సీఎం అయ్యే అదృష్టం ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తి రేపుతున్న అంశంగా మారింది. బీజేపీ నుంచి రేస్ లో సమ్రాట్ చౌదరీ, వినయ్ కుమార్ సిన్హా, సీనియర్ ఎమ్మెల్యేలు ప్రేం కుమార్, మంగల్ పాండే, రేణుదేవి సహా మరికొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బీజేపీ అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతుందన్నది రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చగా ప్రస్తుతం మారింది.
రాజ్యసభ ఎన్నికలు రావడంతోనే సీఎం మార్పు




Leave a Reply