NewsInn

News in a Click

రాజ్య‌స‌భ అభ్య‌ర్థులు నామినేష‌న్ల దాఖ‌లు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

తెలంగాణాలో ఖాళీ అయిన రెండు రాజ్య‌స‌భ స్థానాల‌కు కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు గురువారం నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. కాంగ్రెస్ హై క‌మాండ్ ఖ‌రారు చేసిన అబిషేక్ మ‌ను సింఘ్వీ, వేం న‌రేంద‌ర్ రెడ్డి అసెంబ్లీ నామినేష‌న్లు వేశారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌హా మంత్రులు, ఎమ్మెల్యేలు నామినేష‌న్లు వేసేందుకు హాజ‌ర‌య్యారు.రాజ్య‌స‌భ‌కు అవ‌కాశం ద‌క్కించుకున్న కాంగ్రెస్ నేత‌ల‌ను స్పీక‌ర్ ప్ర‌సాద్ కుమార్ స‌న్మానం చేశారు. బుధ‌వారం సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లోభాగంగా అధిష్టానంతో చ‌ర్చ‌లు జ‌రిపి అభ్య‌ర్థుల జాబితాను ఖ‌రారు చేశారు. ఒక స్థానం గ‌తం నుంచి కొన‌సాగుతున్న అభిషేక్ మ‌ను సింఘ్వీకి కేటాయిస్తూ కాంగ్రెస్ హై క‌మాండ్ నిర్ణ‌యం తీసుకోగా మ‌రో స్థానానికి సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత స‌న్నిహితుడుగా ఉన్న వేం న‌రేంద‌ర్ రెడ్డి పేరును ప్ర‌తిపాదించడంతో కాంగ్రెస్ హై క‌మాండ్ కూడా ఆమోదం తెలిపింది.రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌కు బీఆర్ ఎస్ దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డంతో వీరి ఎన్నిక లాంఛ‌నంగానే చెప్పుకోవ‌చ్చు. రాష్ట్రం నుంచి రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన నేత‌ల‌ను కాంగ్రెస్ నేత‌లు ప్ర‌త్యేకంగా క‌లిసి అభినంద‌న‌లు తెలిపారు.

అభ్య‌ర్థుల ఎంపిక‌లో సీఎం మార్క్….

రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల‌ ఎంపిక‌లో సీఎం రేవంత్ రెడ్డి త‌న మార్క్ వేసుకున్నారు. ఎంతో మంది సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌లు రాజ్య‌స‌భ స్థానాన్ని ఆశించినా…అంద‌రినీ కాద‌ని త‌న ఆప్త మిత్రుడు వేం న‌రేంద‌ర్ రెడ్డికి రాజ్య‌స‌భ అవ‌కాశం ద‌క్కేలా చ‌క్రం తిప్పి విజ‌య‌వంతం అయ్యారు. సామాజిక స‌మీక‌ర‌ణ‌లు తెర‌పైకి వ‌చ్చినా వాటిని హై క‌మాండ్ ఏమాత్రం ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా రేవంత్ చ‌క్రం తిప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *