NewsInn

News in a Click

అస‌భ్య‌ ప్ర‌వ‌ర్త‌న‌-వివాదంలో పాక్ క్రికెటర్

-శ్రీలంక సీరియ‌స్

(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్‌)

భార‌త-శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న ఐసీసీ టీ-20 ప్ర‌పంచ క‌ప్ పోటీలు తుది ద‌శ‌కు చేరుకుంటున్నాయి. పాక్ సెమీఫైన‌ల్ కు చేర‌కముందే పోటీ నుంచి ఓట‌మితో వైదొల‌గాల్సి వ‌చ్చింది. భార‌త జ‌ట్టు చేతిలో ఓడిన నాటి నుంచి పాక్ క్రికెట్ లో సంక్షోభం దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయి. పాక్ క్రికెట‌ర్ల‌కు, మాజీ క్రికెట‌ర్ల‌కు కొన్ని రోజుల పాటు మాట‌ల యుద్ధం జ‌రిగింది. పాక్ క్రికెట్ బోర్డు కూడా ఆట‌గాళ్ల‌పై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ వ‌చ్చింది. ఇదే స‌మ‌యంలో పాకిస్తాన్ ఆట‌గాళ్లు శ్రీలంక హోట‌ల్ లో బ‌స చేసిన సంద‌ర్భంగా చోటు చేసుకున్న ఘ‌ట‌న పాక్ క్రికెట్ ను కుదిపేస్తోంది. ప్ర‌పంచ క్రికెట్ లో తీవ్ర చ‌ర్చ‌కు దారి తీస్తోంది. హోట‌ల్ హౌస్ కీపింగ్ నిర్వ‌హించే మ‌హిళ‌తో క్రికెటర్ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన‌ట్లు వెలుగులోకి వ‌చ్చింది. ఆ క్రికెటర్ వ్య‌వ‌హ‌రించిన తీరుతో గ‌ట్టిగా అర‌చిన మ‌హిళ ద‌గ్గ‌రకి హోట‌ల్ సిబ్బంది రావ‌డంతో అస‌లు బండారం బ‌య‌ట‌ప‌డింది. ఈ విష‌యం పై హోట‌ల్ యాజ‌మాన్యం సీరియ‌స్ గా స్పందించిన‌ట్లు తెలుస్తోంది. పాక్-శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ కు ముందే ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై హోట‌ల్ యాజ‌మాన్యం పాక్ క్రికెట్ మేనేజ‌ర్ కు ఫిర్యాదు చేసిన‌ట్లు స‌మాచారం. పాక్ జ‌ట్టు మేనేజ‌ర్ తాత్క‌లికంగా ఈ స‌మ‌స్య నుంచి గ‌ట్టెక్కించినా పీసీబీ కి విష‌యం చేర‌వేయ‌డంతో పీసీబీ కూడా విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశించిన‌ట్లు తెలుస్తోంది.

దీంతో పాక్ జ‌ట్టు వ్య‌వ‌హ‌రం ఇంటా- బ‌య‌టా ఒకే విధంగా మారిన‌ట్ల‌యింది. ఒక్క క్రికెట‌ర్ వ్య‌వ‌హ‌రించిన తీరు ఆ జ‌ట్టు ఆట‌గాళ్లంద‌రిపైనా ప్ర‌భావం చూపేలా క‌నిపిస్తోంది. పీసీబీ ఆ క్రికెట‌ర్ పై ఎలాంటి చ‌ర్య‌లు చేప‌డుతుంద‌న్న‌ది ఇప్పుడు క్రికెట్ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌కు దారి తీస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *