NewsInn

News in a Click

నిర్మాణంలో ఉన్న భ‌వ‌నం ద‌గ్గ‌ర ప్ర‌మాదం

ముగ్గురు కూలీల మృతి

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

హైద‌రాబాద్ లో భవన నిర్మాణ ప‌నుల్లో కూలీ ప‌నులు చేస్తున్న కూలీలు మృతి చెందారు. నగ‌రంలోని టౌలి చౌకి స‌మీపంలోని అల్ హస్నాత్ కాలనీలో భవన నిర్మాణ పనులు చేస్తుండగా విషాద ఘటన చోటుచేసుకుంది. ఏడ‌వ‌ అంతస్తులో పనులు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఐదుగురు కార్మికులు కిందకు పడిపోయారు. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భవన నిర్మాణ పనుల్లో భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు, గాయ‌ప‌డ్డ వారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన కూలీలుగా గుర్తించారు.ఈ ప్ర‌మాదంలో స‌మీపంలో నిలిపి ఉన్న ఆటో తో పాటు కారు కూడా ధ్వంసం అయింది.

G+2 నిర్మాణానికి అనుమ‌తి

ప్ర‌మాద స్థలాన్ని షేక్ పేట త‌హ‌సీల్దార్ ప‌రిశీలించారు. కేలం రెండు అంతస్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి తీసుకుని ఏడు అంత‌స్తులు నిర్మాణం చేస్తున్నార‌ని గుర్తించారు. రెండు అంత‌స్తుల‌కే అనుమ‌తి ఉండ‌డంతో భ‌వ‌నాన్ని సీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *