
- 20 ఓవర్లలో 253 పరుగులు చేసిన భారత్
(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్)
ఇంగ్లాండ్ తో జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్ ముందు భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది. అభిషేక్,సూర్య కుమార్ మినహా మిగిలిన బ్యాటర్లు ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకు పడ్డారు. ఏ ఒక్క బౌలర్ ను కూడా వదలకుండా పరుగులు రాబట్టుకున్నారు. 20 ఓవర్లలో 253 పరుగులను భారత జట్టు చేసింది. ఇంగ్లాండ్ విజయం సాధించాలంటే 254 పరుగల లక్యాన్ని భారత్ నిర్దేశించింది.
టీ-20 ప్రపంచ కప్ లో భారత జట్టు ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ అభిషేక్ శర్మ తన బ్యాటింగ్ ఫాం లేమితో సెమీఫైనల్ లో కూడా తొందరగానే ఔటయ్యారు. అయినా ఆ ప్రభావం జట్టుపై పడకుండా మిగిలిన బ్యాట్సెమెన్లు రాణించారు. సంజుశాంసన్ తన ఫాంను కొనసాగిస్తున్నారు. 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసుకుని 8.3 ఓవర్లలో భారత జట్టు స్కోరును వంద పరుగులు దాటించారు. అభిషేక్ ఔటౌన తరువాత క్రీజ్ లోకి వచ్చిన ఇషాన్ కిషన్- సంజు శాంసన్ లు ఇంగ్లాండ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. 10 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత జట్టు రెండు వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 39 పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తరువాత బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పుతో దుబే బ్యాటింగ్ వచ్చారు.సంజు శాంసన్, శివం దూబెలు భారత జట్టు స్కోరు వేగం తగ్గకుండా ఆడారు.13.1 ఓవర్లలో 160 పరుగుల వద్ద శాంసన్ భారీషాట్ ఆడబోయి విల్ జాక్స్ బౌలింగ్ లో ఫిల్ సాల్ట్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. 42 బంతుల్లో 89 బంతులు చేసిన సంజు 8 ఫోర్లు, 7 సిక్స్ లు కొట్టారు. సంజు స్థానంలో బ్యాటింగ్ వచ్చిన సూర్య- దుబేలు కూడా అదే జోరు కొనసాగించారు. 13 ఓవర్లలోనే 190 పరుగుల దగ్గర భారత్ 4 వికెట్ సూర్య రూపంలో కోల్పోయింది.

సూర్యకుమార్ 6 బంతుల్లో 11 పరుగులు చేసి స్టంప్ ఔటయ్యారు. 15.4 ఓవర్లలో భారత జట్టు 190 పరుగులు చేసింది. సూర్య ఔటన తరువాత స్కోరు పెంచే బాద్యతలను దుబే- పాండ్యలు తీసుకున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లపై ఇద్దరు బ్యాటర్లు భారీగా పరుగులు పిండుకున్నారు. సమన్వయ లోపంతో శివం దూబె 43 పరుగులు చేసి రనౌట్ అయ్యారు. 25 బంతుల్లో 4 సిక్సర్ల సహాయంతో 43 పరుగులు దుబే చేశారు. ఆ తరువాత హర్దిక్ తిలక్ వర్మలు కూడా బౌలర్ల పై అటాక్ చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో తిలక్ వర్మ 7 బంతుల్లో 21 పరుగులు చేసి ఆర్చర్ బౌలింగ్ లో ఔటయ్యారు. హర్దిక్ పాండ్య రెండో పరుగు కోసం ప్రయత్నించి 12 బంతుల్లో 27 పరుగులు చేసి రనౌట్ అయ్యారు.
ఇంగ్లాండ్ ఫేస్ బౌలర్ 4 ఓవర్లలో 60 పరుగులు ఇచ్చి కేవలం ఒక్క వికెట్ దక్కించుకున్నారు. ఆదిల్ రషీద్ 41 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు విల్ జాక్స్ 40 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నారు. ఇద్దరు బ్యాట్స్ మెన్లు రనౌట్ అయ్యారు.
.




Leave a Reply