
ఇంగ్లాండ్ సెమిఫైనల్ నుంచి ఔట్
(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్)
భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్ ను దెబ్బతీసేందుకు ఇంగ్లాండ్ అనుసరించిన వ్యూహం విజయవంతం అయింది రెండో ఓవర్లోనే స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ 9 పరుగులు చేసి ఔటయ్యారు. మరో ఓపెనర్ సంజు శాసంన్, ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ చక్క దిద్దే పనిలో పడ్డారు. ఈ దశలో సంజు శాంసన్ 15 పరుగుల స్కోరు వద్ద ఉన్న సమయంలో పవర్ ప్లే ముగియక ముందే ఆర్చర్ బౌలింగ్ సంజు శాంసన్ షాట్ కొట్టేందుకు ప్రయత్నించారు. సరైన టైం కుదరకపోవడంతో ఇంగ్లాండ్ కెప్టన్ బ్రూక్ చేతిలోకి బంతి వెళ్లింది కానీ…సులువైన క్యాచ్ ను బ్రూక్ జార విడిచారు. దీంతో సంజు కు 15 పరుగుల వద్ద లైఫ్ దొరికినట్లయింది. ఇక అప్పటి నుంచి సంజు తన ఆటలో గేరు మార్చి భారత జట్టు భారీ స్కోరు సాధించేందుకు అనుగుణంగా పరుగులు చేశారు. 8 ఫోర్లు,7 సిక్స్ లతో 42 బంతులో 89 పరుగులు చేసి 14 ఓవర్లో ఔటయ్యారు. ఈ క్యాచ్ జార విడవడంతో ఇంగ్లాండ్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. సంజు వేగంగా పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ పై భారత జట్టు 20 ఓవర్లలో 253 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
బ్రూక్ జార విడిచిన క్యాచ్ చూడండి….



Leave a Reply