NewsInn

News in a Click

ఐసీసీ ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ కు చేరుకున్న భార‌త్

ఐసీసీ ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ కు చేరుకున్న భార‌త్
  • ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ పై భార‌త్ విజ‌యం

(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్‌)

భారీ విజ‌య‌ల‌క్ష్యంతో బ‌రిలో దిగిన ఇంగ్లాండ్ జ‌ట్టు ప‌రుగులు సాధిస్తూ…వికెట్లు కోల్పోతూ ల‌క్ష్యం సాధించే దిశ‌గా అడుగులు వేసింది. ప‌వ‌ర్ ప్లే లోనే మూడు కీల‌క వికెట్లు కోల్పోయినా ర‌న్ రేట్ మాత్రం కొన‌సాగిస్తూ భార‌త్ కు ధీటుగా స‌మాధానం ఇచ్చింది. 254 ప‌రుగులు చేయాల్సిన జ‌ట్టు 247 ప‌రుగుల‌ను సాధించింది. ఒక ద‌శ‌లో గెలుపు సునాయ‌స‌మే అన్న‌విధంగా ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ కొన‌సాగింది. బార‌త జ‌ట్టు కీల‌క ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ల‌ను త్వ‌ర‌గానే ఔట్ చేసినా… ఇంగ్లాండ్ బ్యాట‌ర్లు బౌల‌ర్ల‌పై విరుచుకు ప‌డుతున్నారు. ఫిల్ సాల్ట్13 ప‌రుగుల వ‌ద్దే తొలివికెట్ రూపంలో వెనుదిరిగారు. ప‌వ‌ర్ ప్లే లోనే ఇంగ్లాండ్ 3 కీల‌క వికెట్లు కోల్పోయి 64 ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టు కీల‌క ఆట‌గాళ్లు హ్య‌రీ బ్రూక్, జోస్ బ‌ట్ల‌ర్ లు వెనుదిరిగారు.

బూమ్రా బౌలింగ్ లో అక్ష‌ర్ ప‌టేల్ అధ్బుత క్యాచ్ తీసుకోవ‌డంతో బ్రూక్ ఔట‌య్యారు. తొలి ఓవ‌ర్ బౌలింగ్ చేసిన అక్ష‌ర్ అదే ఓవ‌ర్లో టాం బాంట‌న్ ను ఔట్ చేశారు. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి జోస్ బట్ల‌ర్ ను బౌల్డ్ చేశారు. దీంతో 95 ప‌రుగుల‌కే నాలుగు వికెట్ల‌ను ఇంగ్లాండ్ కోల్పోయింది. ఈ ద‌శ‌లో క్రీజులోకి వ‌చ్చిన జాకబ్ బేథిల్, విల్ జాక్స్ లో భార‌త బౌల‌ర్ల‌పై విరుచుకు ప‌డ్డారు. ముఖ్యంగా స్పిన్ బౌల‌ర్ల‌ను టార్గెట్ చేస్తూ సిక్స్ లు, ఫోర్లు కొడుతూ ఇంగ్లాండ్ స్కోరును పెరుగులు పెట్టించారు. ఈ ఇద్ద‌రు బ్యాట్స్ మెన్లు భార‌త జ‌ట్టులో ఆందోళ‌న రేపారు. బౌల‌ర్లు ఎలా బౌలింగ్ చేసినా బేథెల్, జాక్స్ లు గ్రౌండ్ న‌లుదిక్కులా బంతిని త‌ర‌లించ‌డమే ల‌క్ష్యంగా ఆడుకున్నారు. జాక్స్ భారీ షాట్ ఆడే ప్ర‌త‌య్నంలో20 బంతుల్లో 35 ప‌రుగులు చేసి అర్ష‌దీప్ బౌలింగ్ లో అక్ష‌ర్ ప‌టేల్ బౌండ‌రీ ద‌గ్గ‌ర అధ్బ‌త‌మైన క్యాచ్ తో ఔట‌య్యారు. ఈ క్యాచ్ మ్యాచ్ కే హైలెట్ గా నిల‌వ‌నుంద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. 172 ప‌రుగుల వ‌ద్ద ఇంగ్లాండ్ 5వ వికెట్ కోల్పోయింది.15 ఓవ‌ర్ల‌లో ఇంగ్లాండ్ 185 ప‌రుగులు చేసింది. భార‌త స్పిన్న‌ర్లు వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, అక్ష‌ర్ ప‌టేల్ ల బౌలింగ్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లు 99 ప‌రుగులు పిండుకున్నారు. ఒక్కో వికెట్ తీసుకున్న ఇంగ్లాండ్ బ్యాట‌ర్లు వీరిని టార్గెట్ చేస్తూ ఎక్కువ‌గా ప‌రుగులు రాబ‌ట్టుకున్నారు. ఇంగ్లాండ్ బ్యాట‌ర్ల జోరుతో భార‌త బౌల‌ర్లు స‌హ‌నం కోల్పోయి అద‌నంగా ప‌రుగులు ఇచ్చుకున్నారు.16.5 ఓవ‌ర్ల‌లో ఇంగ్లాండ్ 200 ప‌రుగుల మైలు రాయిని చేరుకుంది. 19వ ఓవ‌ర్లో పాండ్య బౌలింగ్ సాం క‌ర్ర‌న్ భారీ షాట్ ఆడ‌బోయి బౌండ‌రీ ద‌గ్గ‌ర తిల‌క్ వ‌ర్మ క్యాచ్ తీసుకోవ‌డంతో 18 ప‌రుగులు చేసి ఔట‌య్యారు.

19 ఓవ‌ర్లు పూర్త‌య్యే స‌రికి ఇంగ్లాండ్ 6 వికెట్లు కోల్పోయి 224 ప‌రుగులు చేసింది. చివ‌రి ఓవ‌ర్ లో 30 ప‌రుగులు ఇంగ్లాండ్ చేయాల్సి ఉంది. బేథెల్ క్రీజులో ఉండ‌డంతో ఇంగ్లాండ్ కు ఇంకా ఆశ‌లు ఊరించాయి. 48 బంతుల్లో 105 ప‌రుగులు చేసిన భేథెల్ తొలి బంతిని బ‌లంగా బాద‌డంతో బౌండ‌రీ ద‌గ్గ‌ర హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ చేసి బంతిని నేరుగా కీప‌ర్ ద‌గ్గ‌ర‌కు విసిరారు. రెండు ప‌రుగులు తీసే ప్ర‌య‌త్నంలో భేథెల్ తొలి బంతికి ర‌నౌట్ కావ‌డంతో ఇంగ్లాండ్ ఓట‌మి ఖ‌రారైంది. కానీ త‌రువాత బంతుల‌కు ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లు 22 ప‌రుగులు చేశారు. దీంతో 7 ప‌రుగుల తేడాతో ఇంగ్లాండ్ పై భార‌త జ‌ట్టు విజ‌యం సాధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *