
అసెంబ్లీలో సీఎం సిద్దరామయ్య ప్రకటన
(హైదరాబాద్,న్యూస్ఇన్)
కర్నాటకలో 16 ఏళ్లలోపు మైనర్లకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నట్లు సీఎం సిద్దరామయ్య అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. పిల్లలు, టీనేజర్లపై సోషల్ మీడియాపై దుష్ప్రభావం చూపుతుందనే కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆస్ట్రేలియా, ఫిన్లాండ్ వంటి దేశాల్లో ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయని, పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం పడకుండా కర్నాటకలో కూడా ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ మంత్రి ఖర్గే అన్నారు.
అదే బాటలో ఆంధ్ర ప్రదేశ్..
అయితే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ దిశగా గత కొన్ని రోజులుగా చర్చ జరుపుతోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం 13 ఏళ్లలోపు చిన్నారుల కు సోషల్ మీడియాను బ్యాన్ చేసే అంశం ప్రతిపాదనల్లో ఉందని అందరితో చర్చించి దీన్ని 16 ఏళ్లకు పెంచే ప్రయత్నాలు చేస్తామన్నారు. సోషల్ మీడియా ను బ్యాన్ చేసేందుకు ఏపీ కూడా రెడీ అవుతోంది. రాబోయే మూడు నెలల్లో ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని బాబు శాసనసభలో ప్రకటించారు. దేశంలోని రెండు రాష్ట్రాలు చిన్నారులకు సోషల్ మీడియా పై నిషేధం విధించడంతో అన్ని రాష్ట్రాలు కూడా ఆ బాటలో నడిచే అవకాశం కనిపిస్తోంది.


Leave a Reply