
పాక్ క్రికెటర్ల జోస్యం
(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
టీ-20 ప్రపంచకప్ మొదలైన నాటి నుంచి బారత క్రికెట్ జట్టును మానసికంగా దెబ్బకొట్టేలా పాక్ మాజీ క్రికెటర్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. గ్రూప్ దశ నుంచి మొదలైన పాక్ ఆటగాళ్ల వ్యాఖ్యలు ఫైనల్ వరకు కూడా కొన సాగుతున్నాయి. పాకిస్తాన్ క్రికెట్ జట్టు గ్రూప్ దశలోనే వెనుదిరిగి పోవడంతో పాక్ క్రికెట్లో అంతర్గత సంక్షోభం కూడా మొదలైంది. భారత్ చేతిలో పాక్ ఓటమి ఎదుర్కొన్నప్పటి నుంచి క్రికెటర్ల వ్యాఖ్యలు మరింత శృతి మించుతున్నాయి. అవకాశం వస్తే చాలు భారత్ ఎదుర్కొనే ప్రత్యర్థి జట్టు విజయం సాధిస్తుందని పాక్ ఆటళగాళ్లు జోస్యం చెబుతున్నారు. భారత జట్టులో లోటు పాట్లను ఎత్తి చూపితే ప్రొఫెషనల్ క్రికెటర్లు వారి వ్యాఖ్యలకు ఇంతో అంతో గౌరవం దక్కుతుంది. ఏకపక్షంగా భారత్ జట్టు ఓటమిని కోరుకునే విధంగానే పాక్ ఆటగాళ్ల కామెంట్లు ఉన్నాయి. నిన్న ఇంగ్లాండ్ మ్యాచ్ కు ముందు ఈ మ్యాచ్ లో భారత్ జట్టు గెలిచే అవకాశం లేదని మహ్మద్ అమీర్, షాహీద్ ఆఫ్రిదీలు వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్ తరువాత షాహీన్ మరో సారి స్పంచారు. ఈ మ్యాచ్ ఎంతో ఉత్కంఠ రేపిందని, బూమ్రా లాంటి బౌలర్ ఉండడంతోనే ఈ మ్యాచ్ భారత్ విజయం సాధించిందని చెబుతూనే…ఫైనల్ లో బలమైన న్యూజీలాండ్ జట్టు చేతిలో భారత జట్టు ఓటమి ఖాయమని వ్యాఖ్యలు చేశారు.తన అల్లుడు షాహీన్ ఆఫ్రిదీ శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో బూమ్రా మాదిరిగా బౌలింగ్ చేసి ఉంటే భారీ విజయాన్ని పాక్ నమోదు చేసుకునేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరో పాక్ మాజీ బౌలర్ అమీర్ ఫైనల్స్ లో కూడా భారత్ గెలిచే అవకాశం లేనే లేదని తేల్చి చెప్పారు.

బలమైన న్యూజీలాండ్ లాంటి జట్లపై భారత్ గెలవడం అసాధ్యమ్నారు. లీగ్ దశలో మ్యాచ్ లు జరుగుతున్న సమయంలో అమీర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ప్రపంచ కప్ లీగ్ దశలోనే అభిషేక్ శర్మపై ముందుగా పాక్ మాజీలు అటాక్ మొదలు పెట్టారు. అభిషేక్ శర్మ స్లాగర్ అంటూ విమర్శలు గుప్పించారు. సాంకేతికంగా బలమైన ఆటగాడు కాదని విమర్శలు చేశారు. ప్రపంచ్ కప్ లో అభిషేక్ ఇంకా ఫాం అందుకోకపోయినా మాజీలు ఇలా విమర్శలు చేయడం చర్చకు దారి తీసింది. సోషల్ మీడియాలో వీరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండడంతో… అందుకు భారత్ క్రికెట్ అభిమానులు కూడా ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు. మీ దేశ క్రికెట్ ను ముందుగా గాడిన పెట్టుకుండి అని కొంత మంది…మీ ఆటగాళ్లకు మరింత శిక్షణను ఇవ్వండని మరి కొంత మంది పాక్ మాజీ క్రికెటర్లకు ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు.

Leave a Reply