- బీఆర్ఎస్ అడ్డు పడుతోంది సీఎం రేవంత్ రెడ్డి
(హైదరాబాద్,న్యూస్ఇన్)
ప్రపంచంలోని హైదరాబాద్ అందమైన నగరమని, ఈ నగరాన్ని మరింత అందంగా తీర్చి దిద్దాలని తాను భావిస్తుంటే ప్రధానప్రతిపక్షమైన బీఆర్ ఎస్ అడ్డు పడుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులు, పెద్ద పెద్ద సంస్థల పెట్టుబడులతో మరింత అభివృద్ధి చెందడం ఖాయమని సీఎం ధీమా వ్యక్తం చేశారు. నగర శివారుల్లో నిర్మించిన ఎకో హిల్ పార్క్ ను సీఎం ప్రారంభించి ప్రసంగించారు.

మంచి ప్రభుత్వం ఉంటే నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగఆ అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. చంద్రబాబు, వైఎస్ ల హాయంలో నగరానికి కృష్ణ, గోదావరి జలాలు వచ్చాయన్నారు. హైదరాబాద్ కు వరద ముప్పు ప్రమాదం ఉందన్న హెచ్చరికలతో నాటి నిజాం నవాబు మూసీ పై నిర్మాణాలు చేపట్టారన్నారు. ప్రస్తుతం నగరంలో ఆక్రమణలు,చెత్తతో నిండిపోయిందన్నారు. నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతానంటే బీఆర్ ఎస్ ఒప్పుకోవడం లేదని విమర్శించారు. మేము చేయలేదు…నువ్వు ఎలా చేస్తావన్నట్లు బీఆర్ ఎస్ వ్యవహరిస్తోందని సీఎం అన్నారు.

రాజీవ్ గాంధీ విమానాశ్రయం నిర్మాణం చేసినప్పుడు ప్రజల్లో కొద్ది మేర వ్యతిరేకత వచ్చిందని, అయితే ఇప్పుడు అది గొప్పగా మారిందన్నారు. త్వరలో శంషాబాద్ బుల్లెట్ ట్రైన్ హబ్ గా మారబోతుందన్నారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు లో బాధితులను అనాధలుగా వదిలి పెట్టమని, నిర్వాసితులకు అన్ని సౌకర్యలు కల్పించి ఆదుకుంటామన్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డిపై పరోక్ష విమర్శలు రేవంత్ చేశారు. చాలా కాలం అక్క మంత్రిగా పనిచేసినా….ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంటే విమర్శలు చేస్తోందన్నారు.

అక్క కుటుంబానికి 40 ఏళ్లుగా అండగా ఉన్న ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంటే అడ్డుకోవడం భావ్యం కాదన్నారు. హైదరాబాద్ లో మూసీ రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. నియోజకవర్గాల్లోనే ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వ స్థలాలను గుర్తించి లబ్ది దారులకు అందచేస్తామని సీఎం ఈ సందర్బంగా ప్రకటించారు.


Leave a Reply