NewsInn

News in a Click

ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక సంబరాలు

కుటుంబంలా కలిసి పనిచేయాలన్న సీఎం

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌)

అసెంబ్లీ స‌మావేవాల ముగింపు సంద‌ర్భంగా ఏపీ ప్ర‌భుత్వం ప‌లు క్రీడా పోటీల‌ను నిర్వ‌హించింది. ముగింపు రోజున ఎమ్మెల్యేల‌తో సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. విజయవాడలోని ఆంత్రా లక్స్‌ కన్వెన్షన్‌లో శుక్రవారం నిర్వహించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు.

జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు సంతోషంగా ఉంది. నేతల క్రీడల్లో చక్కగా రాణించారు. క్రీడోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడుని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఎన్టీఆర్ పాత్రలో జీవించారు. నేతన్నలను ప్రోత్సహించేందుకు మహిళా ప్రజా ప్రతినిధులు చేనేత వస్త్రాలు ధరించి రావడం అభింనందనీయం. ప్రతి ఒక్క నేత కలిసిమెలిసి కుటుంబంలా పనిచేయాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన సభ్యులకు ముఖ్యమంత్రి బహుమతులు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *