
- తిరుపతి లో కమర్షియల్ గ్యాస్ లేదు
(హైదరాబాద్,న్యూస్ఇన్)
వారం రోజుల క్రితం మొదలైన యుద్ధ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై మొదలైంది. ప్రధానంగా పెట్రో ఉత్పత్తులపై ఈ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. గ్యాస్ సరఫరాపై ఏజన్సీలు ఇప్పటికే నిబంధనలు అమలు చేయడం మొదలు పెట్టడంతో పాటు గ్యాస్ ధరలను ఒక్క సారిగా షాక్ ఆ సంస్థలు పెంచేశాయి. గృహవినియోగం కోసం వాడే సిలిండర్ ధర హైదరాబాద్ రూ.965 రుపాయలకు చేరింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర కూడా వంద రుపాయాలకు పైగా పెరిగింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ గతంలో ఒక్క రోజులోనే గ్యాస్ ఏజన్సీలు డెలివరీ చేసేవి. కానీ ఇప్పుడు మూడు నుంచి నాలుగు రోజుల సమయం తీసుకుంటుంది. ఓ వైపు గ్యాస్ ధరలు పెంచడంతో పాటు గృహ వినియోగదారులు ఒక్క సిలిండర్ బుక్ చేసుకోవలంటే బుకింగ్ గడువు కనీసం 30 గ్యాప్ ఉండాలన్న నిబంధనను అమలు చేయడం మొదలు పెట్టాయి. డబుల్ సిలిండర్ ఉన్న వారికి నెల రోజుల గడువు కాగా… సింగిల్ సిలిండర్ ఉంటే 21 రోజుల గడువును విధించాయి.

తిరుపతిపై తీవ్ర ప్రభావం….
వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయలేమని గ్యాస్ ఏజన్సీలు ప్రకటించాయి. దీంతో తిరుమల వచ్చే భక్తులపై తీవ్ర ప్రభావం పడడంతో పాటు స్థానిక వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పని పరిస్థితి నెలకొంది. శనివారం నుంచి వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా చేయలేమని ఏజన్సీలు చేతులు ఎత్తేయడంతో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో 3 వేలకు పైగా వాణిజ్య అవసరాలను వినియోగించే కనెక్షన్లు ఉన్నాయి. రోజు వేలాది మంది ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి బాలజీ దర్శనానికి వచ్చే వారిపై ఈ ప్రభావం పడనుంది. గ్యాస్ కంపెనీల నిర్ణయంతో తిరుపతి హోటళ్లపై తీవ్ర ప్రభావం పడనుంది.

తెలంగాణాలో గుడ్డుపై…….
భారత దేశం నుంచి పెద్ద ఎత్తున కోడిగుడ్లు ఇతర దేశాలకు ఎగుమతి అవుతాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తరువాత తెలంగాణా నుంచి గుడ్లను ఎక్కువగా ఉత్పత్తి చేస్తోంది. మార్చి మొదటి వారం నుంచి యుద్ధ ప్రభావం కారణంగా మధ్య ప్రాశ్చ్య దేశాలకు ఎగుమతి నిలిచి పోయింది. ఈ ప్రభావంతో గుడ్ల నిల్వలు పేరుకు పోయాయి. నిన్న మొన్నటి వరకు రూ.8 పలికిన గుడ్డు ధర అనూహ్యంగా సగానికి పడిపోయింది. దీంతో పౌల్ట్రీ రంగం ఎన్ని రోజులు సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో అన్న అందోలన పౌల్ట్రీ వ్యాపార వేత్తల్లో మొదలైంది.


Leave a Reply