NewsInn

News in a Click

ప్రాధాన్యతల వారీగా ఇరిగేషన్ ప్రాజెక్టులు

సమీక్షలో సీఎం చంద్రబాబు

(అమరావతి,న్యూస్ఇన్‌)

ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో ప్రాధాన్య‌త‌ల వారిగా పూర్తి చేస్తూ…నాణత్య పాటించే అంశంపై రాజీ పడే ప్రసక్తే ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణాలు చేసే క్రమంలో ప్రజా భద్రత ముఖ్యమనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రాధాన్యత క్రమంలో చేపట్టాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంపై శుక్రవారం అసెంబ్లీలోని తన ఛాంబర్లో సీఎం చంద్రబాబు సమీక్షించారు. పోలవరం, వెలిగొండ, హంద్రీ-నీవా, పోలవరం-నల్లమల సాగర్ లింక్, చింతలపూడి లిఫ్ట్, వరికపూడిశెల లిఫ్ట్, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల ప్రగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. వివిధ ప్రాజెక్టులకు చేపట్టాల్సిన పునరావాస పనుల పైనా చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి ఎంతో ప్రాధాన్యమిస్తోంది. రకరకాల కారణాలతో రాష్ట్రంలో కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు సుదీర్ఘ కాలంపాటు ఎన్నికల హామీలుగా మిగిలిపోతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు శంకుస్థాపనలు చేసిన ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాకపోవడం సరికాదు. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలి. ప్రాజెక్టులు కట్టాలనే డిమాండ్లు ఎన్నికల హామీలుగా మిగిలిపోకూడదు. ప్రజల అవసరాలను తీర్చేలా ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేయాలి. అందుకే ప్రణాళికాబద్దంగా… ప్రాధాన్యతలను సిద్దం చేసుకుని ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నాం. పోలవరం సహా రాయలసీమ, పల్నాడు, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను ఓ క్రమపద్దతిలో పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకున్నాం. ఇరిగేషన్ రంగానికి గతంలోనూ… ఇప్పుడు పెద్ద పీట వేసి అవి పూర్తి అయ్యేలా చేసింది.. చేస్తోంది కూటమి ప్రభుత్వమే. ఇదే సమయంలో ప్రాజెక్టుల నిర్మాణాల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే ఉండకూడదు. ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తాను. ఉన్నతాధికారులు మొదలుకుని.. క్షేత్ర స్థాయిలో ఉన్న సిబ్బంది ఏ ఒక్కరూ అలక్ష్యం వహించినా చర్యలు తీసుకుంటాను.

న‌ల్ల‌మ‌ల సాగ‌ర్ అనుమ‌తులు సాధించాలి….

పోలవరం నిర్మాణం విషయంలో కేంద్రంతో నిరంతరం టచ్ లో ఉండాలి. పోలవరం నిర్మాణానికి సంబంధించిన ప్రతి అప్డేట్ కేంద్రంలోని సంబంధిత వ్యవస్థలకు ఎప్పటికప్పుడు చేర్చాల్సిందే. ప్రమాణాలు, నాణ్యత పాటించే విషయం సహా నివేదికల పరంగా, సాంకేతికాంశాల పరంగా, డాక్యుమెంటేషన్ పరంగా ఎలాంటి లోపాలు ఉండకూడదు… తేడాలు రాకూడదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్రం సహా ఎవ్వరూ వేలెత్తి చూపే పరిస్థితి రాకూడదు. పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు అంతర్జాతీయ స్థాయీ నిపుణులు తరుచూ సందర్శనకు వచ్చేలా చూడండి. ప్రాజెక్టుల‌ నిర్మాణ పనులు చేపడుతూనే.. మరోవైపు పునరావాసం పైనా ఫోకస్ పెట్టాలి. దీనికి అవసరమైన మేరకు విడతల వారీగా నిధులను విడుదల అయ్యేలా ఆర్థిక శాఖ అధికారులతో ఇరిగేషన్ అధికారులు సమన్వయం చేసుకోవాలి. పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై కేంద్రంపై ఒత్తిడి పెంచాలి. అనుమతులు సాధించాలి.

ఆక‌ట్టుకున్న ఎమ్మెల్యేల సాంస్కృతిక సంబ‌రాలు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *