
ప్రాణాల మీదకు తెచ్చుకోకండి
(హైదరాబాద్,న్యూస్ ఇన్)
వేసవి కాలం రావడంతో మద్యం ప్రియుల డిమాండ్ ను తీర్చడం లిక్కర్ కంపెనీలకు ఓ దశలో కత్తి మీద సాముగా మారుతుంది. ప్రధానంగా వేసవిలో బీఆర్ అమ్మకాలు జోరుగా సాగుతుంటాయి.వేసవి ఎండకు…ఛిల్ కావాలని అంతా చల్లటి బీర్ సేవించేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. బీరు ప్రియుల డిమాండ్ ను తీర్చే సందర్భంగా లిక్కర్ కంపెనీలు కూడా తమ నాణ్యతా ప్రమాణాలను పూర్తిగా పట్టించుకోవడంలేదు. ఓ వైపు బీర్ బాటిళల్లో చెత్త దర్శనం ఇవ్వడం షరా మామూలుగా కనిపించేదే అన్న వాదన ఉంది. అయితే వేసవి ప్రారంభంలోనే ఈ పరిస్థితి ఇప్పుడు ఎదురౌతోంది. హైదరాబాద్ లోని వేర్వేరు ప్రాంతాల్లో ఒక చోట బీరు బాటిల్ ఓపెన్ చేసి సగం పుచ్చుకున్న తరువాత మత్తు దిగిపోయేలా బీర్ బాటిళ్లలో నీళ్లలో ఉండే పాకురు కనిపించింది. వినియోగదారుడు ఆ దుకాణ దారుడిని అడిగినా పెద్దగా పట్టించుకోలేదు.

మధ్యం షాపు యజమాని బీరు తయారు చేసిన కంపెనీని అడుగాలని సమాధానం ఇచ్చారు. దీంతో దుకాణ దారుడితో పాటు తయారు బీరు తయారీ కంపెనీపై చర్యలు తీసుకోవాలని ఆ వినియోగదారుడు డిమాండ్ చేస్తున్నారు. మద్యం తయారీ సంస్థలు నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్నాయా లేదా అన్న విషయంపై ఎక్సైజ్ శాఖ సరైన పర్యవేక్షణ చేయడంలేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆహార ఉత్పత్తులపై తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నట్లే, మద్యం తయారీ డిస్టిలరీలపై కూడా తనిఖీలు చేయాలని డిమాండ్ వినిపిస్తోంది.
మార్చి మొదటి వారంలోనే ఎండల ఎఫెక్ట్



Leave a Reply