
బూమ్రా 4, అక్షర్ 3 వికెట్లు
96 పరుగుల తేడాతో భారత్ విజయం
( స్పోర్ట్స్ డెస్క్ ,న్యూస్ఇన్)
256 పరుగుల విజయ లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజీలాండ్ ఓపెనర్లు దూకుడు చూపారు. అర్షదీప్ వేసిన మొదటి ఓవర్ లోనే అలెన్ ఇచ్చిన సునాయస క్యాచ్ ను శివం దుబె డ్రాప్ చేయడంతో బతికి బయటపడ్డారు. 3వ ఓవర్ లో అక్షర్ పటేల్ అలెన్ ను ఔట్ చేయడంతో న్యూజీలాండ్ తొలి వికెట్ 31 పరుగుల వద్ద కోల్పోయింది. డేంజరస్ బ్యాట్సెమెన్ ఔట్ కావడంత్ భారత్ ఊపిరి పీల్చుకుంది. ఆతరువాతి ఓవర్ వేసి జస్ప్రీత్ బూమ్రా బౌలింగ్ లో రచిన్ రవీంద్ర భారీ షాట్ కొట్టే క్రమంలో న్యూజీలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ సీఫర్ట్, ఫిలిప్స్ లు పరుగుల వేటలో పడ్డారు. కానీ అక్షర్ పటేల్ రెండో ఓవర్లో మరో కీలక బ్యాట్స్ మెన్ ఫిలిప్ 5 పరుగులు చేసి బౌల్డ్ అయ్యారు. దీంతో కీవిస్ 47 పరుగలకే 3 వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లేలోనే న్యూజీలాండ్ 3 కోల్పోయి కష్టాల్లో పడింది.సిఫెర్ట్, చాఫ్ మన్ లు కొద్ది సేపు భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నట్లే కనిపించినా….. చాప్ మన్ న్యూజీలాండ్ స్కోరు 74 పరుగుల వద్ద హార్దిక్ పాండ్య బౌలింగ్ లో 8వ ఓవర్ లో బౌల్ట్ అయ్యారు. దీంతో కీవిస్ 4వ వికెట్ కోల్పోయింది. మరో వైపు సీఫర్ట్ 23 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నారు. జోరుమీదున్న సీఫర్ట్ 9వ ఓవర్లో భారీ సాట్ ఆడబోయారు…కానీ ఇషాన్ కిషన్ అధ్బతంగా బంతిని అందుకోవడంతో 52 పరుగుల వద్ద సీఫర్ట్ ఔటయ్యరు. దీంతో న్యూజీలాండ్ పరాజయం వైపు అడుగులు పడడం ఖాయమైంది. 72 పరుగలకే 9 ఓవర్లలో 5 కీలక వికెట్లు కోల్పోయింది.భారత బౌలర్లపై న్యూజీలాండ్ బ్యాట్స్ మెన్లు పరుగులు సాధించే క్రమంలో అటాక్ చేసినా….వారిపై వత్తిడి పెంచడంలో బౌలర్లు విజయవతం అయ్యారు.

బూమ్రా, హర్దిక్, వరుణ్, అక్షర్ పటేల్ లు వరుసగా న్యూజీలాండ్ బ్యాటర్లను పెవీలియన్ పంపారు. 10 ఓవర్లకు కీవిస్ 5 వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. శాంట్నర్, డరైల్ మిచెల్ లు స్కోరును ముందుకు తీసుకెళుతున్నా రన్ రేట్ కు అనుగుణంగా పరుగులు సాధించకపోవడంతో వత్తిడి పెరుగుతూ వచ్చింది.వీరిద్దరు క్రీస్ లో ఉన్న సమయంలోనూ కీవీస్ 100 పరుగులు పూర్తి చేసుకుంది. 124 పరుగుల వద్ద 6వ వికెట్ కోల్పోయింది, అక్షర్ పటేల్ బౌలింగ్ మిచెల్ ఇషాన్ కిషన్ కు సునాయస క్యాచ్ ఇచ్చి ఔటయ్యరు. అక్షర్ 3 ఓవర్లు బౌల్ చేసి 3 వికెట్లు తీసుకున్నారు.15 ఓవర్లలో న్యూజీలాండ్ 5 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది.19వ ఓవర్ వేసిన అభిషేక్ శర్మ బౌలింగ్ లో చివిరి వికెట్ కోల్పోవడంతో ఇండియా విజయం సాధించింది.
కీవీస్ ఓటమి 16వ ఓవర్లోనే ఖరారు….
భారత జట్టు కీలక బ్యాట్స్ మెన్లు 16వ ఓవర్లో ముగ్గురు ఔటవ్వడంతో భారత్ స్కోరు మందిగించింది. అయితే న్యూజీలాండ్ ఇన్నింగ్స్ కూడా బూమ్రా వేసిన 16వ ఓవర్లో తడపడింది. ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లను బూమా్ర తీసుకోవడంతో ఆ జట్లు 143 పరుగులకు 8 వికెట్లు కోల్పోయి ఓటమికి చేరువైంది. వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసుకున్న బూమ్రా హ్యాట్రిక్ నమోదు చేయలేకపోయారు. నాలుగో ఓవర్ లో శాంట్నర్ ను బౌల్డ్ చేసి నాలుగో వికెట్ తీసుకున్నారు. 18 వ ఓవర్ పూర్తి అయ్యే వరకు 154 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది.
16వ ఓవర్ లో భారత్ కూడా 3 వికెట్లు ఇండియా ఒకే సారి కోల్పోయింది.


Leave a Reply