NewsInn

News in a Click

ఎండ‌ల‌తో ఉప‌శ‌మ‌నం- త్వ‌ర‌లో తుఫాన్

గ‌త నాలుగైదు రోజులుగా అనూహ్యంగా పెరిగిన వేస‌వి ఊష్ణోగ్ర‌త‌ల‌తో కాస్త ఉప‌శ‌మ‌నం ల‌భించ‌నుంది. శ‌ని, ఆదివారాల్లో ఊష్ణోగ్ర‌త‌లు పెరిగినా 9వ వ‌తేదీ నుంచి కాస్త త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేస్తోంది. ఈ నెల 16వ తేదీ నుంచి భారీ తుఫానుతో రాష్ట్ర వ్యాప్తంగా వ‌డ‌గ‌ళ్ల‌తో వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తోంది. 16 నుంచి 23వ తేదీ వ‌ర‌కు వ‌ర‌కు ఈ ప్రభావం ఉండే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ వ‌ర్షాల‌తో రైతులు తీవ్రంగా న‌ష్ట పోయే అవ‌కాశం ఉంద‌ని ఐఎండీ అధికారులు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. రైతులు అన్ని ముందు జాగ్రత్త చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచ‌న‌లు చేస్తున్నారు. ఉరుములు, మెరుపుల‌తో పాటు వ‌డ‌గ‌ళ్లు కురిసే చాన్స్ ఉంద‌ని అధికారుల అంచ‌నా. ఈ కార‌ణంగ చేతికొచ్చిన పంట‌లు దెబ‌తినే అవ‌కాశం ఉంద‌ని రైతులు ముందు జాగ్ర‌త చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు సూచ‌న‌లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *