NewsInn

News in a Click

ఓలింపిక్స్ కు ఆతిథ్యం ఇచ్చేలా స్టేడియం ఉండాలి

సీఎం రేవంత్ రెడ్డి

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీలో సౌక‌ర్యాలు క్ప‌లించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. క్రీడా సౌక‌ర్యాల క‌ల్ప‌నతో పాటు క్రీడా మైదానాల ఏర్పాటు త‌దిత‌ర అంశాల‌పై సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు. రాష్ట్రంలో క్రీడాకారుల‌కు అంత‌ర్జాతీయ స్థాయ సౌక‌ర్యాలు, ప్ర‌మాణాల‌ను అందుబాటులోకి తెచ్చే విధంగా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఒలింపిక్స్ ల‌క్ష్యంగా క్రీడాకారుల‌కు శిక్ష‌ణ ఇచ్చేందుకు అనుగుణంగా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీల‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయాల‌న్నారు.

న‌గ‌రంలోని గ‌చ్చిబౌలి స్టేడియాన్ని పున‌రుద్ధ‌రించ‌డంతో పాటు స్టేడియం ఆవ‌ర‌ణ‌లోని ఇండోర్ స్టేడియం, యూనివ‌ర్సిటీ కాంప్లెక్స్, హాస్ట‌ల్ భ‌వ‌నాలు అన్ని ర‌కాల క్రీడా మైదానాల‌ను శిక్ష‌ణ‌కు అవ‌స‌ర‌మ‌య్యే సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని ఆదేశించారు. ఒలింపిక్స్, కామ‌న్ వెల్త్ క్రీడ‌ల‌కు రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చినా… ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఏర్పాట్లు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీఎం అభిప్రాయం వ్య‌క్తం చేశారు. కోట్ల విజ‌య‌భాస్క‌ర్ రెడ్డి స్టేడియం, ఎల్ బీ స్టేడియం, స‌రూర్ న‌గ‌ర్ స్టేడియం ల‌ను భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు అనుగుణంగా శిక్ష‌ణ‌, పోటీల‌కు అతిథ్యం ఇచ్చేలా ఆధునీక‌రించాల‌ని సీఎం ఆదేశించారు. కొత్త‌గా నిర్మాణం చేప‌ట్టే నిర్మాణాల‌పై సీఎం ప‌లు డిజైన్ల‌ను ప‌రిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *