
- గాడిదల సంఖ్య ను పెంచడమే లక్ష్యం
(హైదరాబాద్,న్యూస్ఇన్)
దేశంలో గాడిదల సంఖ్య గణనీయంగా తగ్గు ముఖం పట్టడంతో గాడిదల పెంపకం కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ పశుసంపద పెంపులో భాగంగా గాడిదల పెంపు ను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ పథకం వ్యక్తిగతంగా లేదంటే రైతు సంఘాల ద్వారా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. 5 నుంచి 50 లక్షల రుణం పథకంలో భాగంగా అందించాలని కేంద్రం నిర్ణయించింది. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. గాడిదల పెంపకాన్ని కనీసం 50 గాడిదలతో మొదలు పెట్టాలని సూచనలు చేసింది. ఇందులో 5 మగ గాడిదలు ఉండాలని నిర్ణయించింది. 50 లక్షల రుణం మంజూరైతే రెండు విడతలుగా సబ్సీడీని కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. ప్రాజెక్టు రుణాన్ని అమోదించిన తరువాత మొదటి విడతలో నిధులు, రెండో విడుతలో అధికారులు ఏర్పాట్లను పరిశీలించి ధృవీకరించిన తరువాత రెండో విడత రుణాన్ని కేంద్రం విడుదల చేస్తోంది.ఈ పథకం దేశీయ గాడిదల పెంపకం పథకానికి మాత్రమే వర్తిస్తుంది. 20వ పశుగణన లెక్కల ప్రకారం దేశంలో ప్రస్తుతం కేవలం 1.23 లక్షల గాడిదలు మాత్రమే ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. 2012 తో పోలిస్తే దాదాపు 60 శాతం గాడిదల సంఖ్య తగ్గిపోయిందని అధికారులు చెబుతున్నారు.

గ్రామీణ రవాణా వ్యవస్థతో గాడిదలు ఎన్నో ఏళ్లుగా ముడిపడి ఉన్నాయి. రవాణా, ఇతర కార్యక్రమాల నిర్వహణ కోసం గాడిదలను గ్రామాల్లో వినియోగించుకునే వారు. యాంత్రీకరణ పెరగడంతో గాడిదల సంఖ్య కూడా తగ్గుతూ వచ్చింది.
గాడిద ఉత్పత్తులకు డిమాండ్….
సాంప్రదాయ చైనీస్ వైద్యంలో విస్తృతంగా ఉపయోగించే ఎజియావోను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే గాడిద చర్మాలకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. గాడిదల పెంపకంపై ఇప్పుడిప్పుడే ప్రభుత్వం కూడా దృష్టి పెట్టడంతో దేశంలో గాడిదల సంఖ్య ను భారీగా పెంచాలన్న లక్ష్యానికి ఈ పథకం ఎంతో ఉపయోగపడనుంది.
హైదరాబాద్ లో ఏసీబీకి పట్టుబడ్డ ఎస్ఐ లు

Leave a Reply