
- సారాయి దుకాణాల మూసీ వేతపై క్లారిటీ కావాలి
(హైదరాబాద్,న్యూస్ఇన్)
అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన అనిరుధ్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బాంబు పేలుస్తానంటూ వ్యాఖ్యలు చేశారు. మరో వారం రోజుల్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అధికార పార్టీ నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికైనా తన మనస్సులోని మాటలను బయటపెట్టడంలో ఆయనకు ఆయనే దిట్ట….గత రెండేళ్లుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పు బట్టారు. దీంతో అధికారులు అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. త్వరలో జరుగబోయే అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణాలో సారాయి దుకాణాలు ప్రారంభించాలన్నదే ఆయన డిమాండ్ గా చెప్పారు. సచివాలయంలో కొద్దిసేపు మీడియాతో మాట్లాడిన ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. గతంలో సారాయి తాగిన వారు వందేళ్లకు పైగా జీవించారని, ఇప్పుడు చీప్ లిక్కర్ తాగుతూ తక్కువ వయస్సులోనే చనిపోతున్నారని చెప్పారు. శాస్త్రీయంగా సారాయి అరోగ్యానికి హానికరం కాదని చెప్పారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో సారాయి దుకాణాలను ప్రారంభిచారన్నారు. రాష్ట్రంలో సారాయి దుకాణాలను ఎందుకు మూసి వేశారో స్పష్టత రావాల్సిన అవసరం ఉందని అనిరుధ్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాలు మొదలైతే జీరో ఆవర్ లో ఈ అంశాన్ని తాను లేవనెత్తుతాని అనిరుధ్ చెప్పారు. మద్యప్రదేశ్, ఒడిష్షా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అధికారికంగానే సారాయి దుకాణాలు నడిపిస్తున్నాయన్నారు.
ఏసీబీ వలలో లంచగొండి ఎస్ ఐ లు

Leave a Reply