
- వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలి
(ఖమ్మం,న్యూస్ఇన్)
వెలుగుమట్ల బాధితులకు భరోసా కల్పించేందుకు వెలుగు మట్లకు వెళ్లిన తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ ఉదయం వారిని కలిసి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు అనుమతి లేకుండా ధర్నా చేయడంతో కవితను అరెస్టు చేసీ విడుదల చేశారు. అయితే రాత్రి 9 గంటల సమయంలో అనూహ్యంగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నట్లు ప్రకటించి దీక్షను మొదలు పెట్టారు. కవిత అన్యూహ్య నిర్ణయంతో ఒక్క సారిగా పరిస్థితులు మారి పోయాయి. అంతకు ముందు మీడియాతో మాట్లాడిన కవిత బాధితుల ఇళ్లు కూల్చి వేసిన చోటే మళ్లీ నిర్మించాలని డిమాండ్ చేశారు. భూధాన్ భూములని పేదల ఇళ్లను ప్రభుత్వం కూల్చి వేయడం సమంజసం కాదరన్నారు. బాధితులకు ఇళ్లు కట్టించే తాము వారికి మద్దతుగా ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు.

Leave a Reply