NewsInn

News in a Click

ఆరు గ్యారెంటీల అమలుకు ప్రైవేట్ మెంబర్ బిల్లు

  • కాంగ్రెస్ హామీల‌పై అసెంబ్లీలో నిల‌దీస్తాం కేటిఆర్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల‌ను అమ‌లు చేయ‌క‌పోవ‌డంపై బీఆర్ ఎస్ సీరియ‌స్ గా ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన తీరును అసెంబ్లీ స‌మావేశాల్లో ఎండ‌ట్టాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.ఆరు గ్యారెంటీలకు ఇచ్చిన మాట ప్రకారం చట్టబద్ధత కల్పించేందుకు ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భారత రాష్ట్ర సమితి తరపున ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్ల‌డించారు. ఆరు గ్యారెంటీ ల ద్వారా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ఈ బిల్లు ద్వారా ఎండగడతామన్నారు. 6 గ్యారంటీలలో పేర్కొన్న మహిళలు, వృద్ధులు, వికలాంగులు, విద్యార్థులు, రైతన్నలు వంటి తెలంగాణ సబ్బండ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం నేపథ్యంలో… ఆయా వర్గాల తరఫున ఈ ప్రవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌భుత్వం వ‌త్త‌డి పెంచేందుకు అనుస‌రించాల్సిన వ్యూహంపై పార్టీ కీల‌క స‌మావేశాన్ని ఈ రోజు ప్ర‌త్యేకంగా నిర్వ‌హించింది.

పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు ప్ర‌త్యేకంగా శిక్ష‌ణా శిబిరం నిర్వ‌హించారు.అనంత‌రం మీడియాతో మాట్టాడిన కేటిఆర్ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల‌ను ఎండ‌గ‌ట్టారు. ఈ సారి కాంగ్రెస్ పెడుతున్న బడ్జెట్.. మూడవ బడ్జెట్ అని దీనికి ఎంతో ప్రాధాన్య‌త ఉంద‌న్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినా అసెంబ్లీలో ఏ కమిటీలను వేయడం లేదన్నారు. అనివార్యంగా శాసనసభ సమావేశాలను నడిపించాల్సి వస్తుంది కాబట్టి ప్రభుత్వం బలవంతంగా నడిపిస్తున్నదన్నారు. రాహుల్ గాంధీకి వెయ్యి కోట్లు ఇస్తామని చెప్తున్న రేవంత్ రెడ్డి రైతన్నలకు ఇవ్వాల్సిన రైతు బంధును మాత్రం పక్కన పెట్టాడని ఆరోపించారు. ఖమ్మంలో ప్రభుత్వ దాష్టీకం వల్ల ఇళ్లు కోల్పోయిన ఖమ్మం వెలుగుమట్ల తరపున, మూసీ బాధితుల తరపున, పేద దళిత గిరిజన ప్రజల కోసం ఈ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామ‌న్నారు.

రాష్ట్రంలో పుష్క‌రాల స‌మ‌యం వ‌చ్చేసింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *