
(హైదరాబాద్,న్యూస్ఇన్)
యుద్ధ వాతావరణ కారణంగా గ్యాస్ సరఫరాకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఇప్పటికే చమురు సంస్థలు గ్యాస్ ధరలను భారీ గా పెంచినా…. డిమాండ్ కు అనుగుణంగా సరఫరా చేయలేకపోతున్నాయి. యుద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుందో…మామూలు పరిస్థితులు ఎప్పుడు వస్తాయో అన్న అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. చమురు మార్కెట్ ఉన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గృహ వినియోగానికి సంబంధించి చమురు ఉత్పత్తి చేయడాన్ని తాము అత్యంత ప్రాధాన్యతగా భావిస్తున్నామని ఆర్ ఐ ఎల్ ప్రకటించింది.
ప్రపంచంలోని అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రిఫైనింగ్ హబ్ గా ఉన్న జామ్నగర్ పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్ల నుండి LPG ఉత్పత్తిని పెంచడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ చర్యలు తీసుకున్నామని వెల్లడించింది. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా LPG ఉత్పత్తిని పెంచడానికి మా బృందాలు నిరంతరం గ్యాస్ ఉత్పత్తి పై దృష్టి పెట్టాయని రిలయన్స్ వెల్లడించింది.దీంతో పాటు KG‑D6 బేసిన్ నుండి ఉత్పత్తి చేయబడిన సహజ వాయువును ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం సరఫరా చేయడంపై దృష్టి సారించినట్లు పేర్కొంది.
గ్యాస్ సరఫరాలో మొదలైన ఇబ్బందులు…

Leave a Reply