
(హైదరాబాద్,న్యూస్ఇన్)
తీవ్ర వివాదాల్లో కూరుకు పోయిన హెచ్ సీఏ కు దాదాపు కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. గతంలో అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రావ్ అక్రమాలు బయటపడడంతో కేసు నమోదు చేసి ఆయన విచారణను ప్రభుత్వం చేపట్టింది. అర్హత లేని క్లబ్ లతో అక్రమాలకు పాల్పడి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని తేలడంతో ఆయన అధ్యక్ష పదవిని కోల్పోయారు. ఆ స్థానంలో అమర్ నాథ్ ను అధ్యక్షుడిగా నియమిస్తూ అంబుడ్స్ మెన్ ప్రకటించారు. జగన్మోహన్ రావ్ పై వచ్చిన ఆరోపణలే హెచ్ సీ ఏ కార్యదర్శి, కోశాధికారులుగి ఎన్నికైన ఆర్. దేవరాజ్, శ్రీనివాస్ రావ్ లపై కూడా రావడంతో ఆ పదవులు కూడా పోయాయి. దీంతో ఉప ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఉప ఎన్నికల్లో ఎంతో మంది పోటీ పడ్డా కార్యదర్శిగా మన్నె జీవన్ రెడ్డి, కోశాధికారిగా సీ. బాబు రావులు విజయం సాధించారు. ప్రస్తుత హెచ్ సీఏ పాలక మండలి గడువు ఈ ఏడాది అక్టోబర్ లో ముగియనుంది. కార్యవర్గ పదవీ కాలం మూడేళ్లు కావడంతో కొత్తగా బాధ్యతలు తీసుకున్న వారంతా రాబోయే ఆరు నెలలు పదవిలో కొనసాగుతారు.

మళ్లీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిస్తేనే తిరిగి కార్యవర్గంలో వారికి చోటు దక్కుతుంది. పాలమూరు జిల్లాకు చెందిన మన్నె జీవన్ రెడ్డి హెచ్ సీఏ కార్యదర్శగా ఎన్నిక కావడంతో పాలమూరు జిల్లా క్రీడాకారులకు మంచి ప్రోత్సహం దక్కతుందని భావిస్తున్నారు. బీసీసీఐ నిబంధనలకు అనుగుణంగా హెచ్ సీఏ జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కీలక పదవి పాలమూరు జిల్లాకు దక్కడంతో జిల్లాలోని క్రికెటర్లకు పౌకర్యాలు మెరుగు పడుతాయన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తిలక్ వర్మ ను సూర్య ఏమన్నారో తెలుసా…..

Leave a Reply