NewsInn

News in a Click

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన ఆధారాలు లేవు

  • రేపు సుప్రీం కోర్టు లో విచార‌ణ‌

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

రాష్ట్రంలో బీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన ప‌ది మంది శాష‌న‌స‌భ్యుల‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని బీఆర్ ఎస్ దాఖ‌లు చేసిన అన‌ర్హ‌త పిటీష‌న్ల‌పై స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ నిర్ణ‌యం తీసుకున్నారు. స్పీక‌ర్ నిర్ణ‌యం ప్ర‌కారం 10 మంది ఎమ్మెల్యేల్లో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీ మారిన‌ట్లు ఆధారాలు ల‌భించక‌పోవ‌డంతో వారు పార్టీ మారిన‌ట్లు భావించిడం లేద‌నే నిర్ణ‌యాన్ని వెల్ల‌డించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో దానం నాగేంద‌ర్, క‌డియం శ్రీహ‌రిల విష‌య‌మే అంద‌రిలోనూ ఆస‌క్తి రేపింది. ఈ ఇద్ద‌రు ఎమ్మెల్యేల అనర్హ‌త పిటీష‌న్ల‌పై కొద్ది సేప‌టి క్రితం స్సీక‌ర్ త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించారు.రాష్ట్రంలో 2023 ఎన్నిక‌ల అనంత‌రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డంతో బీఆర్ ఎస్ పార్టీ నుంచి విజ‌యం సాధించిన ప‌ది మంది శాస‌న‌స‌భ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ….

దానం నాగేంద‌ర్- ఖైర‌తాబాద్
క‌డియంశ్రీహ‌రి- స్టేష‌న్ ఘ‌న్ పూర్
కాలే యాద‌య్య‌- చేవెళ్ల‌
గూడెం మ‌హిపాల్ రెడ్డి- పఠాన్ చెరు
అరికెపూడి గాంధీ-శేరిలింగంప‌ల్లి
తెల్లం వెంక‌ట్రావ్- భ‌ద్రాచ‌లం
బండ్ల కృష్ణ‌మోహ‌న్ రెడ్డి-గ‌ద్వాల‌
ఎమ్మెల్యే సంజ‌య్- జ‌గిత్యాల‌
పోచారం శ్రీనివాస్ రెడ్డి- బాన్సువాడ‌
ప్ర‌కాశ్ గౌడ్-రాజేంద్ర‌న‌గ‌ర్

వీరంతా ఏడాది కాలంలోనే ఒక్క‌క‌రు బీఆర్ ఎస్ పార్టీకి దూరం అవుతూ వ‌చ్చారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్య‌ల‌పై సీరియ‌స్ గా అనర్హ‌త వేటు వేయాల‌ని డిమాండ్ చేస్తోంది. ముందుగా స్పీక‌ర్ కు ఫిర్యాదు చేయ‌డంతో పాటు ఆ త‌రువాత సుప్రీం కోర్టును బీఆర్ ఎస్ ఆశ్ర‌యించింది. సుప్రీం కోర్టు గ‌డువు విధించిన నేప‌థ్యంలో ఇటీవ‌ల గ‌త కొన్ని రోజుల్లోనే స్పీకర్ త‌న ప‌రిధిలో ఉన్న పిటీష‌న్ల‌ను కొట్టి వేస్తూ అన్ని పిటీష‌న్ల‌పై నిర్ణ‌యం తీసుకున్నారు. గురువారం సుప్రీం లో ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై కేసు విచార‌ణ‌కు రానుంది. గ‌తంలో వివిధ రాష్టాల్లో ఫార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విష‌యంలో సుప్రీం తీర్పుతో ఎమ్మెల్యేలపై అన‌ర్హ‌త వేటు ప‌డ‌డంతో…. తెలంగాణాలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేపై అనర్హ‌త వేటు ప‌డుతుంద‌న్న ధీమా బీఆర్ ఎస్ వ్య‌క్తం చేస్తోంది.

అయితే ఈ రోజు స్పీకర్ వెల్ల‌డించిన తీర్పు అంద‌రిలోనూ ఆస‌క్తి రేపింది. దానం నాగేంద‌ర్ బీఆర్ ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గా ఖైర‌తా బాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి విజ‌యం సాధించారు. బీఆర్ ఎస్ కు అధికారం ద‌క్క‌క‌పోవ‌డంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ త‌రువాత వ‌చ్చిన ఎంపీ ఎన్నిక‌ల్లో సికింద్రాబాద్ ఎంపీ గా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఒకే ఏడాది రెండు ఎన్నిక‌ల్లో రెండు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసి రాజ‌కీయంగా హైద‌రాబాద్ లో మారోసారి త‌న‌కు తానే సాటి అని నిరూపించుకున్నారు. ఇక క‌డియం శ్రీహ‌రి విష‌యానికి వస్తే త‌న కూతురు క‌డియం కావ్య‌కు కాంగ్రెస్ లో ఎంపీ టికెట్ ఇస్తామ‌న్న అఫ‌ర్ రావ‌డంతో బీఆర్ఎస్ ను వీడారు. ఈ కార‌ణంగా ఈ ఇద్ద‌రు ఎమ్మెల్యేలపై స్పీక‌ర్ నిర్ణ‌యం ఎలా ఉంటుందో అన్న ఆస‌క్తి ఆంద‌రిలోనూ క‌నిపించింది.

స్పీక‌ర్ నిర్ణ‌యం ప్ర‌జాస్వామ్యానికి గొడ్డ‌లి పెట్టు….

దానం నాగేంద‌ర్, క‌డియం శ్రీహ‌రిల‌కు క్లీన్ చిట్ ఇవ్వ‌డం ప్ర‌జాస్వామ్యానికి గొడ్డ‌లి పెట్టు అని బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఎక్స్ లో త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసిన వ్య‌క్తికి కూడా క్లీన్ చీట్ ఇవ్వ‌డం అంటే ప్ర‌జా తీర్పును అవ‌మాన ప‌రిచిన‌ట్లేన్నారు. స్పీక‌ర్ తీసుకున్న ఈ నిర్ణ‌యం ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌లో చీక‌టి రోజు అని అభివ‌ర్ణించారు. ఇలాంటి నిర్ణ‌యాలు ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని స‌రైన స‌మ‌యంలో స‌రైన స‌మాధానం చెబుతార‌ని కేటిఆర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *