NewsInn

News in a Click

న‌గ‌రానికి తాకిన‌ వాణిజ్య‌’గ్యాస్’ సెగ‌

  • మూత ప‌డుతున్న హోట‌ళ్లు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రానికి గ్యాస్ క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. వాణిజ్య అవ‌స‌రాల‌కు వినియోగించే గ్యాస్ పూర్తి స్థాయిలో అంద‌డం లేదు. రోజుకు క‌నీసం 20 సిలిండ‌ర్లు విన‌యోగించే హోట‌ళ్ల‌కు నాలుగు, ఐదుకుమించి అంద‌క‌పోవ‌డంతో హోట‌ల్, హాస్ట‌ల్స్ నిర్వాహ‌కులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. యుద్ధ ప్ర‌భావంతో దేశ వ్యాప్తంగా కీల‌క న‌గ‌రాల్లో ఇప్ప‌టికే వాణిజ్య అవ‌స‌రాల‌కు వినియోగించే గ్యాస్ స‌మ‌స్య‌లు సృష్టిస్తోంది.గ‌త నాలుగైదు రోజులుగా స‌మ‌స్య మొద‌లైనా ఈ రోజు హైద‌రాబాద్ లో తీవ్ర రూపం దాల్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న నిల్వలు హోట‌ళ్లు, హాస్లళ్ల నిర్వాహ‌కుల ద‌గ్గ‌ర ఉన్నంత వ‌ర‌కే త‌మ వ్యాపారాలు నిర్వ‌హించుకునే ప‌రిస్తితి ఏర్ప‌డింద‌ని హోట‌ల్ అసోసియేష‌న్ ప్ర‌క‌టించింది.

రాష్ట్ర ప్ర‌భుత్వం వాణిజ్య గ్యాస్ అవ‌స‌రాల‌ను తీర్చే విధంగా గ్యాస్ స‌ర‌ఫ‌రా చేయాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. అమీర్ పేట‌, హై టెక్ సిటీ ప్రాంతాల్లో ఎక్కువ‌గా ఉండే హాస్ట‌ళ్ల నిర్వాహ‌కుల ప‌రిస్థితి కూడా దాదాపు ఇదే ప‌రిస్థితి. గ్యాస్ స‌ర‌ఫ‌రా త‌గ్గితే తాము కూడా మెను త‌గ్గించాల్సి వస్తుంద‌ని నిర్వాహ‌కులు సంకేతాలు ఇస్తున్నారు. ఇక చిన్నా, చిత‌ర హోట‌ళ్ల నిర్వాహ‌కులు మాత్రం ఇప్ప‌టికే టిపిన్ ధ‌ర‌ల‌ను పెంచారు. క‌నీసం 5 రుపాయ‌ల నుంచి 14 రుపాయాల వ‌ర‌కు హోట‌ళ్ల‌లో రేట్లు పెంచారు. గ్యాస్ భారం కార‌ణంగానే ధ‌ర‌లు పెంచాల్సి వ‌స్తుంద‌ని హోటల్ నిర్వాహ‌కులు వాపోతున్నారు. మ‌రో రెండు, మూడు రోజుల్లో ఇప్పుడున్న గ్యాస్ నిల్వ‌లు కూడా పూర్త‌వుతాయ‌ని ఆ త‌రువాత ఎలా నిర్వ‌హించాలో అంతుచిక్క‌డం లేద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే మెనులో ఉన్న పూరి, వ‌డ‌, దోష‌, లాంటివి అందించ‌లేమ‌ని టిఫెన్ సెంట‌ర్ల నిర్వాహ‌కులు మెనులోనుంచి తొల‌గించారు. గ్యాస్ క‌ష్టాలు తీరే వ‌ర‌కు న‌గ‌రంలో హోటళ్ల‌లో ఇదే ప‌రిస్థితి కొన‌సాగ‌నుంది.

గృహ‌వినియోగ గ్యాస్ ఉత్ప‌త్తి పెంచ‌నున్న రిల‌య‌న్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *