
-సీఏం రేవంత్ రెడ్డికి మేథా పాట్కర్ లేఖ
(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తూ మూసీ సుందరీకరణ ప్రాజెక్టును పూర్తి చేయాలని అడుగులు వేస్తోంది. మూసీ పరివాహక ప్రాంతంలో భూ సేకరణ చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పనులు చేసేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా మార్చి 13వ తేదీన మూసీ పునరుజ్జీ ప్రాజెక్టు పనులనుఆపాలని ప్రముఖ పర్యారణ వేత్త మేథా పట్కార్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ మేరకు లేఖ రాశారు. ప్రాజెక్టు ప్రారంభానికి ముందు అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని ఆమె కోరారు. మూసీ జన ఆందోళన్ తరపున తాను ఈ లేఖ రాస్తున్నట్లు ఆమె లేఖలో పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మూసీ పై ఈ ప్రతిపాదనలు తెరపైకి వచ్చినా వివిధ కారణాలతో ముందుకు సాగలేకపోయిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు రాహుల్ గాంధీ, జైరాం రమేష్, మీనాక్షి నటరాజన్ లకు లేఖను రాశారు.

మేథా పాఠ్కర్ మూసీ పై చేసిన ప్రతిపాదనలు …….
- 2026 మార్చి 13న జరగనున్న ఆవిష్కరణ కార్యక్రమాన్ని తక్షణమే నిలిపివేయాలి. బదులుగా ప్రాజెక్ట్కు సంబంధించిన ముసాయిదా సమగ్ర ప్రణాళికను ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో ప్రజలకు విడుదల చేసి కనీసం 60 రోజులపాటు అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరించాలి.
- ప్రభావిత వర్గాలను, మూసీ జన ఆందోళన్ ప్రతినిధులతో, MRDCL అధికారులతో కలిసి మీ నాయకత్వంలో విశ్లేషణాత్మక చర్చలు జరపాలి. మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజాభిప్రాయం సేకరణ జరుపాలి.
- ప్రాజెక్ట్ను సుందరీకరణ చేసేందుకు స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలి. RFCTLARR చట్ట ఉల్లంఘనలు, పర్యావరణ ప్రభావ లోపాలు, సామాజిక-పర్యావరణ ప్రభావాలపై సమగ్ర సమీక్ష జరగాలి. ఇందులో మూసీ జన ఆందోళన, ప్రభావిత ప్రజలకు పూర్తి భాగస్వామ్యం కల్పించాలి.
- మూసీ రివర్ఫ్రంట్ ప్రాజెక్ట్కు సంబంధించిన అన్ని భూసేకరణ నోటీసులను తక్షణమే ఉపసంహరించాలి, ముఖ్యంగా 2017 సవరణలను ఉపయోగించి జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలి.
- తెలంగాణ శాసనసభలో చట్టం ద్వారా 2017 సవరణలను రద్దు చేసి 2013 LARR చట్టాన్ని అసలు రూపంలో పునరుద్ధరించాలి. ఈ ప్రక్రియను ‘ప్రజా పాలన’ సిద్ధాంతానికి అనుగుణంగా పారదర్శకత, బాధ్యతాయుత పాలనను మీ ప్రభుత్వం అమలు చేస్తుందని ఆశిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
మూసీ సుందరీకరణపై సీఎం రేవంత్ ఏమంటున్నారంటే..

Leave a Reply