NewsInn

News in a Click

మూసీ సుంద‌రీక‌ర‌ణ‌పై ‘స‌ర్కార్’ ముందుకే

మూసీ సుంద‌రీక‌ర‌ణ‌పై ‘స‌ర్కార్’ ముందుకే

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా మూసీ సుంద‌రీక‌ర‌ణ ప్రాజెక్టును పూర్తి చేయాల‌ని భావిస్తోంది. మూసీ సుంద‌రీ క‌ర‌ణ‌, పున‌రుజ్జీవ ప‌థ‌కంలో భాగంగా ముందుగా బాపు ఘాట్ ప్రాంతాన్ని గాంధీ స‌రోవ‌ర్ పేరుతో భారీ ప్రాజెక్టును మొద‌లు పెట్టేందుకు రెడీ అవుతోంది. దాదాపు ఏడాది క్రితం ఇందుకు సంబంధించి కార్యాచ‌ర‌ణ ప్ర‌భుత్వం మొద‌లు పెట్టింది. విప‌క్ష పార్టీలు ఆ యా ప్రాంతాల్లో బాధితుల‌ను క‌లుసుకుంటూ మెరుగైనా ప్ర‌త్యామ్నాయం చూపాల‌ని డిమాండ్ చేస్తోంది. దాదాపు ఆరు నెల‌లుగా ఈ త‌తంగం మ‌రింత రాజుకుంటుంది. తాజాగా ఈ ప‌థ‌కంపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సీరియ‌స్ గా ఉండ‌డంతో మ‌రోసారి ఈ ప్రాజెక్టు వ్య‌వ‌హారం రాష్ట్ర రాజ‌కీయాల్లో వివాదాస్ప‌దంగా మారింది. మూసీ, ఈసా న‌దులు క‌లిసే త్రివేణి సంగమంగా ఉన్న బాపు ఘాట్ స‌మీపంలో భారీఎత్తున భూసేక‌ర‌ణ చేసి అత్యంత సుంద‌రంగా ఈప్రాంతాన్ని తీర్చి దిద్దాల‌ని సీఎం ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేశారు. అందులో భాగంగా బండ్ల‌గూడ‌, హైద‌ర్షా కోట్ ప్రాంతాల్లో భూసేక‌ర‌ణ‌కు నోటిఫికేష‌న్లు విడుద‌ల చేయ‌డంతో మ‌రోసారి రాజ‌కీయం రాజుకుంది. విప‌క్ష పార్టీలు మూసీ సుంద‌రీక‌ర‌ణ‌పై త‌మ‌కు అభ్యంత‌రం లేదంటూ ప్ర‌క‌టన‌లు చేస్తూ… బాధితుల పోరాటానికి అండ‌గా ఉంటామ‌ని ప్ర‌క‌ట‌న చేస్తున్నాయి.

ఈ అంశాన్ని రాజ‌కీయ కోణంలోనే సీఏం రేవంత్ రెడ్డి చూస్తున్నారు. రాజ‌కీయంగా ముందుకు వెళ్లేందుకు బీఆర్ ఎస్ నేత‌లు బ్రేకులు వేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని సీఎం ఆరోపిస్తూ…ఈ ప్రాజెక్టును ఖ‌చ్చితంగా పూర్తి చేసి తీరుతామ‌ని ప్ర‌క‌ట‌న చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు త్వ‌ర‌లో నే శంకుస్థాప‌న చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. గాంధీ స‌రోవ‌ర్ శిలాఫ‌ల‌కం వేసేందుకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప‌ర్య‌టించి ప‌లువురు కేంద్ర మంత్రుల‌ను ఆహ్వ‌నించారు. ఇక క్షేత్ర స్థాయిలో ఆందోళ‌న‌లు తీవ్ర కావ‌డంతో అధికారుల నుంచి మార్కె ట్ ధ‌ర‌కు అనుగుణంగా పున‌రావ‌సంలో ప్ర‌భుత్వం చెల్లిస్తుంద‌ని పున‌రావాస బాధితుల‌ను ఒప్పించే ప‌నిలో ప‌డ్డారు. మ‌రో వైపు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కూడా గురువారం ప్రాజెక్టుపై కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్నారు. ఈ ప్రాజెక్టుపై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ చేసి ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌ల‌ను వివ‌రించేందుకు రెడీ అవుతున్నారు.

పేద‌ల ఇళ్ల కంటే ఆ ఆపార్ట్ మెంట్ పై అంద‌రి ప్రేమ‌….

మూసీ సుంద‌రీ క‌ర‌ణ‌లో వేలాది మంది పేద‌లు ఇళ్లు కోల్పోతున్నా…. ఓ భారీ ఆపార్ట్ మెంట్ చుట్టూ రాజ‌కీయం ఎక్కువ‌గా జ‌రుగుతుండ‌డం ఆస‌క్తి రేపుతున్న అంశంగా మారింది. వేలాది మంది పేద‌ల కంటే రాజ‌కీయ పార్టీలకు ఈ ఆపార్ట్ మెంట్లో ఉండే పెద్ద‌ల కార‌ణంగా అత్యంత ప్రాధాన్య‌త అంశంగా మారింది. అధికార, విపక్ష పార్టీలు పేద‌ల కంటే ఈ ఆపార్ట్ మెంట్ వాసుల‌పైనే అమిత‌మైన ప్రేమ చూపిస్తున్నాయి. అయితే ఈ ఆపార్ట్ మెంట్ లో మాజీ సీఎం కేసిఆర్, ప్ర‌స్తుత సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత స‌న్నిహితులైన కొంత మంది నివాసం ఉంటున్నారు. నేరుగా ముఖ్య‌మంత్రుల‌తో మాట్లాడే సాన్నిహిత్యం కూడా వారికి ఉంద‌ని అపార్ట్ మెంట్ వాసులు అంటున్నారు. ఇలాంటి వారు ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం కూడా అక్క‌డ నివాసం ఉంటున్న వారిలో తీవ్ర చ‌ర్చ‌కు దారి తీస్తోంది. ఆపార్ట్ మెంట్ వాసులు త‌మ ఆపార్ట్ మెంట్ ను భూ సేక‌ర‌ణ‌లో భాగంగా స్వాధీనం చేసుకునే ప్ర‌య‌త్నాల‌ను త‌ప్పు బ‌డుతున్నారు. కానీ ముఖ్య‌మంత్రితో స‌న్నిహితంగా ఉంటున్న వారి అభిప్రాయం మాత్రం ఎక్క‌డా అధికారికంగా బ‌య‌ట‌కు రాక‌పోవ‌డం విశేషం. వీరి కోస‌మే అన్ని రాజ‌కీయ పార్టీలు ఆ పార్ట్ మెంట్ ను ప్ర‌త్యేకంగా చూస్తున్నాయ‌న్న చ‌ర్చ కూడా జ‌రుగుతోంది.

ఈ పరిస్థితుల్లో గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు ప‌నులు మొద‌లు పెట్ట‌వ‌ద్దంటూ ప్ర‌ముఖ ప‌ర్యావ‌ర‌ణ వేత్త మేథా ప‌ఠ్కార్ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అ్ర‌గనేత రాహూల్ గాంధీకి లేఖ రాశారు.. గాంధీ మ‌నువ‌డు తుషార్ గాంధీ పేద‌ల ఇళ్లు కూల్చి గాంధీ స‌రోవ‌ర్ పేరుతో ప్రాజెక్టు నిర్మాణం చేయ‌డాన్ని త‌ప్పు బ‌డుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *