
- మత్తు మందు ఇచ్చి అభరణాలు లూటీ
(హైదరాబాద్,న్యూస్ఇన్)
నగరంలోని ప్రముఖ కార్పోరేట్ ఆసుపత్రి యశోదా ఆసుప్రతిలో నకిలీ డాక్టర్ కేసు కలకలం రేపుతోంది. నకిలీ డాక్టర్ ఎవరికి అనుమానం రాకుండా ఆసుపత్రిలో చికిత్సి పొందుతున్న మహిళకు మత్తు మందు ఇచ్చి ఆమె ఒంటిపై ఉన్న 10 తులాల బంగారాన్ని కాజేసింది.సుధారణి అనే మహిళా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పిన తరువాత ఓ నకిలీ డాక్టర్ సుధారాణి చికిత్స పొందుతున్న గదికి వచ్చి చికిత్స పొందుతున్న మహిళ సంబంధీకులను అందరినీ గది నకిలీ డాక్టర్ బయటకు పంపారు. ఆమె తెచ్చిన మత్తు ఇంజక్షన్ చికిత్స పొందుతున్న మహిళకు ఇచ్చి ఆమె మత్తులోకి జారుకోవడంతో డాక్టర్ ముసుగులో వచ్చిన మహిళా సుధారాణి ఒంటిపై ఉన్న నగలు తీసుకుని వెళ్లి పోయింది.

డాక్టర్ వెళ్లి పోయిన కొద్దిసేపటికి పేషంట్ బంధువులు గురించి ఆసుపత్రి యాజమాన్యం దృష్టికి విషయం తీసుకెళ్లారు.దీంతో ఆ మత్తు మందు ఇచ్చి ఆభరణాలు లూటీ చేసిన మహిళ గురించి సీసీ టీవీల్లో రికార్డు అయిన దృష్యాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యాజమాన్యం బాధ్యత లేదా…..
రోగుల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేసే ఇలాంటి కార్పోరేట్ ఆసుపత్రుల్లో పేషంట్ల భద్రత పై ఈ ఘటన ఎన్నో అనుమానాలు కలిగిస్తోంది. నేటి మార్క్ ధరను అంచనా వేసినా 10 తులాల బంగారం అంటే దాదాపు 15 నుంచి 16 లక్షల రుపాయాలు…దీనిపై ఆసుపత్రి యాజమాన్యం ఎలా స్పందిస్తుందో అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతున్న అంశంగా మారింది. రోగి కుటుంబం కోల్పోయిన నగలపై ఆసుప్రతి యాజమాన్యం పోలీసు కేసు పెట్టి చేతులు దులుపుకుంటుందా…..తమ ఆసుపత్రిలో జరిగిన ఘనటకు బాధ్యత వహిస్తుందా అన్నదే ప్రశ్న. నకిలీ డాక్టర్ ఆసుపత్రిలోకి ఎలా వచ్చింది…వస్తే నేరుగా ఆ పేషంట్ ఉన్న గదిలోకే ఎలా వెళ్లింది….ఆసుపత్రి సిబ్బంది సహకారం ఇందులో ఏమైనా ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు నమోదు చేసిన కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆసుపత్రి యాజమాన్యం ఎలా వ్యవహరిస్తుందన్నదానిపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.రోగుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లే….ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఈ చోరీ ఘటనకు ఆసుపత్రి యాజమాన్యం బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.







Leave a Reply