
( హైదరాబాద్,న్యూస్ఇన్)
వేసవి కాలం ఇప్పుడిప్పుడే మొదలైంది. వేసవిలో వచ్చే చెడుపు వానలుగా చెప్పుకునే వర్షాలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తెలంగాణా, ఏపీ లోని దాదాపు అన్ని జిల్లాల్లో ఈ ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ కారణంగా చేతికొచ్చిన పంటలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందన్న అనుమానాలు రైతుల్లో వ్యకం అవుతున్నాయి. గాలి, వానతో మామిడిపూత కూడా రాలిపోయే అవకాశం ఉంటుందని వ్యవసాయాధికారులు హెచ్చరిస్తున్నారు.
ఈ వర్షాల ప్రభావం తూర్పు రాయలసీమ ప్రాంతం (నంద్యాల – కడప – తిరుపతి – చిత్తూరు) మరియు కోస్తా ఆంధ్రలోని కొన్ని భాగాలు (ముఖ్యంగా విజయవాడ మరియు విశాఖపట్నం నగరాలతో సహా మధ్య మరియు ఉత్తర ఆంధ్ర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే చాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.అదే విధంగా తెలంగాణా ఉత్తర తెలంగాణా, దక్షిణా తెలంగాణాల్లో వర్ష ప్రభావం ఉండనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రైతులు తమ పంటలను కాపాడుకునే చర్యలపై దృష్టి పెట్టాలన్న సూచనలు అధికారులు చేస్తున్నారు.







Leave a Reply