NewsInn

News in a Click

‘మూసీ’ పై మ‌రో ముంద‌డుగు వేస్తున్న స‌ర్కార్

‘మూసీ’ పై మ‌రో ముంద‌డుగు వేస్తున్న స‌ర్కార్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

మూసీ సుంద‌రీక‌ర‌ణ ప్రాజెక్టులో భాగంగా చేప‌డుతున్న అభివృద్ది ప‌నుల‌పై మూసీ రివ‌ర్ ఫ్రంట్ డెవ‌ల‌ప్మెంట్ కార్పోరేష‌న్ మూసీ ఆహ్వానం పేరుతో ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ చేయ‌నుంది.గ‌త కొద్ది నెల‌లుగా ఈ వ్య‌వ‌హారం రాష్ట్ర రాజ‌కీయాల్లో హాట్ హాట్ గా మారింది. ఈ ప్రాజెక్టు పై పూర్తి స్థాయి అధ్య‌య‌నం చేసి నివేదిక సిద్ధం చేసిన కార్పోరేష‌న్ పీపీపీ ని కూడా రూపొందించింది. నేడు సాయంత్రం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి , మంత్రులు, ఎమ్మెల్యేల ముందు కార్పోరేష‌న్ మూసీ పున‌రుజ్జీవ ప‌థ‌కాన్ని ఆవిష్క‌రించ‌నుంది.మూసీ పునరుజ్జీవనం.. స్వచ్ఛమైన నీటి సరఫరా, పర్యావరణ పరిరక్షణ, నది తీరాల అభివృద్ధి, ప్రజోపయోగ మౌలిక వసతుల ఏర్పాటుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టు ల‌క్ష్యాల‌ను ప్ర‌భుత్వం వివ‌రించ‌నుంది. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా తొలి దశలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టాలని స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది.

ఈ ప్రాజెక్టు ప‌నుల‌ను త్వ‌ర‌లోనే మొద‌లు పెట్టేందుకు స‌ర్కార్ సిద్ధం అవుతోంది. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఇటీవ‌ల ఢిల్లీలో ప‌ర్య‌టించి కేంద్ర మంత్రుల‌కు ఆహ్వానాలు అందించారు. గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాల‌ని విజ్ఙ‌ప్తి చేశారు. అయితే ఇక్క‌డ భూ సేక‌ర‌ణ వివాదం రాజుకోవ‌డంతో ప్ర‌భుత్వం కూడీ ఈ ప్రాజెక్టును అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని పూర్తి చేయాల‌న్న ల‌క్ష్యంగా అడుగులు వేస్తోంది. ఈ రోజు జ‌రిగే ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ అనంత‌రం గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుపై మ‌రింత స్ప‌ష్ట‌త వ‌చ్చే విధంగా ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల్లోకి త‌మ కార్య‌చ‌ర‌ణ‌ను తీసుకెళ్లేందుకు రెడీ అవుతోంది. రాజేంద్ర న‌గ‌ర్ నియోజ‌య‌వ‌ర్గ ప‌రిధిలోనే తొలి విడ‌త భూసేక‌ర‌ణ జ‌రుగ‌నుంది.

పేద‌ల కంటే పెద్ద‌ల‌పైనే పార్టీల దృష్టి…..

మూసీ సుంద‌రీక‌ర‌ణ ప్రాజెక్టులో వేలాది మంది పేద‌ల ఇళ్లు కోల్పోతున్నారు. వీరికి ప్ర‌త్యామ్నాయం చూపించి భూ సేక‌ర‌ణ చేయాల‌ని విప‌క్ష పార్టీలు ఆందోళన చేశాయి. ఈ ప‌థ‌కం తెర‌పైకి వ‌చ్చిన నాటి నుంచి ఈ అంశం విప‌క్షాల‌కు అస్త్రంగా మారింది. అయితే తాజాగా మూసీ స‌మీపంలో ఉన్న ఒక ఆపార్ట్ మెంట్ ను కూడా సేక‌రించాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డంతో…. పేద‌ల కంటే పార్టీల దృష్టి పెద్ద‌లు ఉండే ఆ ఆపార్ట్ మెంట్ పై ఎక్కువ‌గా ప‌డింది. పేద‌ల‌కు న‌ష్ట ప‌రిహారం ఇచ్చే విష‌యంలో నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేస్తున్న స‌ర్కార్ కూడా ఈ అపార్ట్ మెంట్ వాసులు డిమాండ్ చేసిన విధంగా న‌ష్ట ప‌రిహారం ఇచ్చేందుకు రెడీ అన్న సంకేతాలు ఇస్తోంది. పేద‌ల‌కు కూడా ఆపార్ట్ మెంట్ వాసుల మాదిరిగానే న‌ష్ట ప‌రిహారం మార్కెట్ ధ‌ర‌కు అనుగుణంగా చెల్లించాల‌నే డిమాండ్ వినిపిస్తోంది. అన్ని రాజ‌కీయ పార్టీలు కూడా ఈ ఆపార్ట‌మెంట్ వాసుల‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నాయి.

మేథా ప‌ఠ్కార్ లేఖ……..

మూసీ సుందరీ క‌ర‌ణ ప్రాజెక్టు చేప‌ట్టేందుకు బాధితులు, ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌ల అభిప్రాయం తీసుకోవ‌డంతో పాటు బాధితుల‌ను భాగ‌స్వామ్యం చేసి వారి అభిప్రాయాల‌కు పెద్ద పీఠ వేయాల‌ని ప్ర‌ముఖ ప‌ర్యావ‌ర‌ణ వేత్థ మేధా ప‌ఠ్కార్ రాష్ట్ర ముఖ్య‌మంత్రికి లేఖ రాసి ప‌లు డిమాండ్ల‌ను ఆమె ప్ర‌స్తావించారు. మ‌హాత్మ‌గాంధీ మ‌నువ‌డు తుషార్ గాంధీ కూడా పేద‌ల ఇళ్లు కూల్చి గాంధీ స‌రోవ‌ర్ పేరుతో ప్రాజెక్టు నిర్మాణం చేయ‌డాన్ని త‌ప్పు బ‌డుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *