– మాజీ మంత్రి హరీష్ రావ్
మూసీ పునర్జీవ పథకంలో భాగంగా సుందరీకరణ చేపట్టేందుకు సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్టు డీపీఆర్ లేకపోయినా భూ సేకరణకు గజిట్ విడుదల చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మాణం చేసే గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రులను సీఎం ఆహ్వానించారని, దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ కు బీజేపీ సహకరిస్తుందా పేదల ఇళ్లు కూల్చేందుకు మద్దతు ఇస్తుందా చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డికి పలు ప్రశ్నలను హరీష్ రావ్ సంధించారు.
హరీష్ రావ్ వేసిన ప్రశ్నలు….
1.అసెంబ్లీ వేదికగా జనవరిలో సీఎం ఇచ్చిన సమాధానం ప్రకారం, హిమాయత్ సాగర్ నుంచి బాపూ ఘాట్ వరకు అధ్యయనం చేసి డిపిఆర్ ఇవ్వడానికి 18నెలలు పడుతుంది అన్నరు. మరి డిపిఆరే రాకుండా పేదలకు ఎలా నోటీసులు ఇచ్చినవు? ఎందుకు పేదల ఇండ్లు కూలగొడుతున్నావు? 10,017 ఇండ్లు కూల్చుతమని గజిట్ ఎలా ఇచ్చావు
2.అసలు మీరు చేస్తున్నది మూసీ నది ప్రక్షాళననా? మూసీ సుందరీకరణనా? మూసీ ప్రక్షాళననా? అసలు ఏం చేస్తున్నావు సమాధానం చెప్పు?
3.అసలు బఫర్ ఎంత? ఒక ప్రభుత్వం 9మీటర్లు, మరొక ప్రభుత్వం 30 మీటర్లు? ఇప్పుడు రేవంత్ రెడ్డి 100 మీటర్లు అంటున్నాడు. అసలు బఫర్ జోన్ ను ఎలా నిర్ణయించారు. ఉంటే స్టడీ బయట పెట్టండి? అసలు మూసి నుండి ఎలా కొలుస్తారు?

4.ఏదైనా ప్రాజెక్టు చేయాలంటే కనీసం వంద ఏళ్ల డేటా తీసుకొని చేస్తాం. హైడ్రాలజికల్ లేదా ఫ్లడ్ వాటర్ స్టడీ చేసారా? చేస్తే బయట పెట్టండి.
5.జనవరిలో జరిగిన శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి ఏడీబీ లోన్ 4,100 కోట్లు మూసీకి ఇవ్వడానికి ఒప్పుకున్నది, మంజూరు అయ్యింది అని చెప్పారు. కానీ ఏడీబీ డిసెంబర్ 15, 2025 లో ఏమన్నది ఇంకా డీపీఆర్ మాకు సమర్పించలేదు, మా పద్దతి పాటిస్తేనే రుణం ఇస్తామని చెప్పింది. జనవరి 23, 2026 నాడు ఏం అన్నది.. మాకు డీపీఆర్ రాలేదు, మేం లోన్ సాంక్షన్ చేయలేదు అని చెప్పింది. నిన్న గాక మొన్న మార్చి 11 నాడు ఇచ్చిన లేఖలో.. మేం ఇంకా లోన్ సాంక్షన్ చేయలేదు అని చెప్పింది. ఇదీ వాస్తవమా కాదా….
6.చాదర్ ఘాట్ లో మూసీలో 300 ఇళ్లు కూల్చారు. యూపీఏనే తెచ్చిన భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కుతున్నడు. పరిహారం ఇవ్వకుండా కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్లల్లకు పంపినవు. భూసేకరణ చట్టం ప్రకారం ఎవరికి ఎంత ఇచ్చారో చెప్పండి?
7.మధు రిడ్జ్ అపార్ట్ మెంట్ వాసులకు 7 ఎకరాలకు 7 ఎకరాలు ఇస్తా అన్నవు. సంతోషం. మధు రిడ్జ్ ఒక్కటే కాదు కదా? మూసీ వెంట మొత్తం 46 కాలనీలు ఉన్నయి. పది వేల ఇండ్లు కూలగొడుతా అంటున్నవు. వీళ్లకు కూడా అదే పద్దతిలో స్థలం కేటాయిస్తవా? బ్యాంకుల్లో నిధులు జమ చేస్తవా? పదివేల మందికి ఇదే తీరుగా ఇళ్లు కట్టిస్తవా? వారి ఉపాధికి ఎవరు బాధ్యులు? సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.
8.మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజల ఆవాసాలే కాదు, మెట్రో రైల్వే స్టేషన్, బస్టాండ్లు ఎస్టీపీలు, దేవాలయాలు, చర్చీలు, ప్రభుత్వ ఆస్తులు ఉన్నయి వీటి విషయంలో ప్రభుత్వ నిర్ణయం ఏమిటో చెప్పాలి







Leave a Reply